Hyderabad: ఇదిగో ఈ ఫొటో షేర్ చేసినందుకే.. IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన వ్యవహారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 400 ఎకరాల భూముల్లో ఉన్న చెట్లను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నించగా వర్సిటీ విద్యార్థులు, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో ఈ అంశం కాస్త సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం సైతం తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.