Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్, టీడీపీ జాబితాలపై సెగ: పోటీకి రెబెల్స్ రెడీ

కాంగ్రెస్, టీడీపీ తొలి జాబితాలను  సోమవారం రాత్రి విడుదల చేశారు. ఈ జాబితాలపై అసంతృప్తులు  బాహాటంగానే  తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  

congress and tdp leaders plans to contest as rebel in upcoming elections
Author
Hyderabad, First Published Nov 13, 2018, 12:33 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ తొలి జాబితాలను  సోమవారం రాత్రి విడుదల చేశారు. ఈ జాబితాలపై అసంతృప్తులు  బాహాటంగానే  తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  ఆయా పార్టీల నిర్ణయాన్ని  నిరసిస్తూ రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు  రంగం సిద్దం చేసుకొంటున్నారు.

సోమవారం అర్ధరాత్రి  కాంగ్రెస్ పార్టీ  65  స్థానాలను  ప్రకటించింది. ఈ జాబితాపై కాంగ్రెస్ పార్టీ నేతలు  బహిరంగంగానే  తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ వెస్ట్ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడంతో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. ఇవాళ సాయంత్రానికి  తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు రాజేందర్ రెడ్డి తేల్చి చెప్పారు.

మరో వైపు  శేరిలింగంపల్లి సీటును టీడీపీకి కేటాయించడంతో  మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు.స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్టు  ఇందిరకు కేటాయించడంతో మాజీ మంత్రి విజయరామారావు అసంతృప్తితో ఉన్నారు. ఇందిర టీఆర్ఎస్‌ అభ్యర్ధి  డాక్టర్ రాజయ్య బంధువంటూ ఆయన  ఆరోపణలు చేశారు. తాను ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగనున్నట్టు చెప్పారు.

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు తొలి జాబితాలో టికెట్టు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఆయన ఉన్నారు. హుటాహుటిన ఆయన ఢిల్లీకి వెళ్లారు. అయితే ఈ స్థానాన్ని టీజేఎస్‌ను కేటాయించే అవకాశం ఉందని  ప్రచారం సాగుతోంది.ఈ స్థానం నుండి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలోనే  జనగామ సీటును  ప్రకటించలేదని  సమాచారం. అయితే జనగామ నుండి  రాజిరెడ్డి బరిలోకి  దిగే అవకాశం లేకపోలేదు. 

దుబ్బాక నుండి మాజీ మంత్రి  దుబ్బాక ముత్యం రెడ్డి తనయుడు దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగే  అవకాశాలు ఉన్నాయి.ఆలేరు నుండి  రామచంద్రారెడ్డి, బాన్సువాడ నుండి మాల్యాద్రి రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. కంటోన్మెంట్ నుండి క్రిశాంక్ రెడ్డి, జడ్చర్ల నుండి అనిరుధ్ రెడ్డి, మంచిర్యాల నుండి అరవింద్ రెడ్డి, సూర్యాపేట నుండి పటేల్ రమేష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. వీరంతా రెబెల్స్ గా బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలను ఇప్పటికే ఇచ్చారు.

కోదా స్థానం కాంగ్రెస్ పార్టీకి కేటాయించడంతో టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్ రెబెల్‌గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ నుండి ఆఫర్ వస్తే ఆయన ఆ పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.కొత్తగూడెం సీటును కాంగ్రెస్ పార్టీకి కేటాయించడంతో  టీడీపీ నేత కోనేరు నాగేశ్వరరావు కూడ రెబెల్‌గా బరిలోకి దిగే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. 

అయితే  ఆయా పార్టీల నాయకత్వాలు వారిని బుజ్జగించేందుకు ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉంది.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకా రెండు జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది. మిత్రపక్షాలు సీట్ల సర్దుబాటులో భాగంగా తమ సీట్లను కోల్పోయే కూటమిలోని పార్టీల నేతలను సంతృప్తిపర్చడం అంతా ఆషామాషీ విషయం కాదు.

సంబంధిత వార్తలు

నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

 

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios