పెండింగ్లో 25 సీట్లు: సోనియా, రాహుల్లదే ఫైనల్
ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురికి టికెట్లు కేటాయించే విషయమై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయానికి స్క్రీనింగ్ కమిటీ సభ్యులు వదిలేశారు.
హైదరాబాద్: ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురికి టికెట్లు కేటాయించే విషయమై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయానికి స్క్రీనింగ్ కమిటీ సభ్యులు వదిలేశారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయం గురువారం సాయంత్రం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకొనే అవకాశం ఉంది. మరో వైపు ఆయా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలకే టికెట్లను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే 57 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన 42 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు ఆ పార్టీ మూడు రోజులుగా కసరత్తు చేస్తోంది.
అయితే సుమారు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు లేదా ముగ్గురు అభ్యర్థులు టికెట్టు కోసం పోటీలో ఉన్నారు. అయితే వీరందరిని గురువారం నాడు ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో ఆశావాహులతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. టికెట్టు ఎవరికి ఇచ్చినా కూడ గెలుపు కోసం పనిచేయాలని సూచించింది.
ఇప్పటికే తమ వద్ద ఉన్న సర్వే నివేదికల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో గెలుపు అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్లను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తోంది.
టికెట్ల కేటాయింపు విషయంలో సామాజిక సమీకరణాలను కూడ పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భావిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక సమతుల్యతను పాటించేందుకు గెలుపు అవకాశాలను పక్కన పెట్టాల్సిన అవసరాలను కూడ కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.
మరో వైపు ఒకే కుటుంబం నుండి రెండు లేదా మూడు టికెట్లు ఆశిస్తున్న వారి విషయమై నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వదిలేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తన కొడుకు రఘువీర్ రెడ్డికి టికెట్ ఆశిస్తున్నారు. మిర్యాలగూడ నుండి రఘువీర్ను బరిలోకి దింపేందుకు జానారెడ్డి ప్రయత్నిస్తున్నారు.
డికె అరుణ తన కూతురును మక్తల్ నుండి బరిలోకి దింపాలని భావిస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుండి బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. నకిరేకల్ నుండి తమ అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు కూడ టికెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు కోరుతున్నారు.మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారు.
అయితే ఒకే కుటుంబం నుండి ఇద్దరు లేదా ముగ్గురికి టికెట్టు కేటాయింపు విషయాన్ని స్క్రీనింగ్ సభ్యులు వదిలేశారు. ఈ విషయమై కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకొంటుంది. గురువారం నాడు ఈ కమిటీ సమావేశం కానుంది.
మాజీ ఎంపీలు సర్వే సత్యనారాయణ, సురేష్ షెట్కార్, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్ అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. విజయశాంతిని కూడ పోటీ విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆరా తీసింది. కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం చెబుతానని విజయశాంతి ప్రకటించారు. గురువారం సాయంత్రం వరకు విజయశాంతి నిర్ణయం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వెయిట్ చేయనుంది.
సంబంధిత వార్తలు
అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు: 50 మందికి ఢిల్లీకి పిలుపు
తుది దశలో కాంగ్రెస్ జాబితా: అసంతృప్తులకు బుజ్జగింపులు
సీట్ల లొల్లి: కాంగ్రెస్పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్కు కోదండరామ్
టీజేఎస్కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?