ధోనీపై నిందలు: మరిన్ని వార్తలు
నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
విచిత్రం: ఇంగ్లాండుపై ఇండియాను ఓడించింది ధోనీయే...
ధోనీ, కేదార్ జాదవ్ బ్యాటింగ్ కు దిగిన సమయంలో ఇంగ్లాండుపై విజయానికి ఇండియా ఐదు ఓవర్లలో 71 పరుగులు చేయాల్సి ఉండింది. వీరిద్దరు కూడా భారీ షాట్లకు వెళ్లకుండా, బంతిని పుష్ చేస్తూ చాలా తీరికగా సింగిల్స్ తీస్తూ వెళ్లారు.
15 ఏళ్ల తరువాత కలిసిన 7/G లవర్స్
సెల్వా రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన 7/G బృందావన కాలనీ 15 ఏళ్ల క్రితం ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అసలు సినిమా ఆ రెంజ్ హిట్టవుతుందని ఎవరు ఊహించలేకపోయారు. అదే విధంగా అందులో నటించిన హీరో హీరోయిన్ రవి కృష్ణ - సోనియా లు ఒక్కసారిగా సౌత్ లో హాట్ టాపిక్ అయ్యారు.
ఇంగ్లాండుపై ఓటమి: పాక్ ను దెబ్బ తీసిన ఇండియా
భారత్ ఏ మాత్రం పోరాట పటిమ కనబరచకుండా తలొగ్గిందని ఇంగ్లాండు మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. సింగిల్స్ తీయడానికి గల కారణాలపై తన వద్ద వివరణ లేదని గంగూలీ అన్నాడు.
గంగూలీ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. భారత్ తరఫున ఒకే ప్రపంచకప్లో మూడు సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.
నిబంధనలకు మించి సెక్యూరిటీ ఇస్తున్నాం: చంద్రబాబు భద్రతపై డీజీపీ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రత కుదించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని చెప్పారు. నిబంధనల ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే ఇచ్చామని డీజీపీ స్పష్టం చేశారు.
ఇండియాపై మా విజయ రహస్యమదే: ఇంగ్లాండు కెప్టెన్ మోర్గాన్
ఈ రోజు మేం అద్భుతం సృష్టించామని, టాస్ గెలవడం.. బ్యాటింగ్ ఎంచుకోవడం వంటివన్నీ కలిసి వచ్చాయని మోర్గాన్ అన్నాడు. జాసన్ పునరాగమనం, బెయిర్స్టో విధ్వంసం అద్భుతమని అన్నాడు. వారి భాగస్వామం వల్ల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగామని అన్నాడు.
రిషబ్ పంత్ ఎక్కడ అన్నారు, చూశారుగా.. రోహిత్ శర్మ కామెంట్
రిషబ్ పంత్ ఎక్కడ, ఎక్కడ అని అడిగారు కదా... ఇదిగో నెంబర్ 4 స్థానంలో ఉన్నాడు చూశారుగా’’ అంటూ టీం ఇండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. పేర్కొన్నారు. ప్రపంచకప్ 2019 లో తొలిసారి టీం ఇండియా ఓటమి చవిచూసింది. ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.
జగన్ ఇంటి వద్ద తొక్కిసలాట : స్పృహ తప్పిన మహిళ
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద తొక్కిసలాట జరిగింది. జగన్ కి ఫిర్యాదులు అందజేయడానికి జనాలు కుప్పలు తెప్పలుగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన మహిళ విశ్రాంతమ్మ స్పృహ తప్పిపడిపోయింది. ముఖ్యమంత్రికి తన సమస్య వివరిద్దామని వచ్చి.. ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది.
ఇంగ్లాండ్ చేతిలో ఓటమి: ధోనీ-జాదవ్ అలా ఎందుకు ఆడారంటే
పిచ్ కారణంగానే వారిద్దరూ నిదానంగా ఆడారని.. ఫ్లాట్ వికెట్ కావడంతో బ్యాటింగ్కు ఏమాత్రం సహకరించలేదని.. అయితే ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి విజయం సాధించారని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
టీమిండియాకు మరో బిగ్ షాక్... ప్రపంచ కప్ నుండి విజయ్ శంకర్ ఔట్
టీమిండియాలో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగుతున్న ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నిన్న(ఆదివారం) ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ కు దూరమైన విషయం తెలిసిందే. అయితే అతడి కాలి గాయం మరింత ఎక్కువ అవడంతో కేవలం ఈ మ్యాచ్ కు కాదు ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు బిసిసిఐ ప్రకటించింది.
పెళ్లికి రెడీ అంటున్న త్రిపుల్ సెంచరీ వీరుడు
ఇండియన్ క్రికెటర్ కరుణ్ నాయర్ పేరు గుర్తుండే ఉంటుంది. అదేనండి ట్రిపుల్ సెంచరీ వీరుడు. ఇప్పుడు గుర్తు వచ్చే ఉంటుంది కదా. ఇంతకీ మ్యాటరేంటంటే... కరుణ్ నాయర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు సనాయా తకరివాలా తో ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం.
టీడీపి భేటీకి జేసి బ్రదర్స్ డుమ్మా: బాలకృష్ణ సైతం. చంద్రబాబు ఆరా
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కీలకమైన నేతలు కొందరు హాజరు కాలేదు. వారిలో మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారి స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారి కుమారులు జెసి పవన్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు.
జగన్ సీఎం కావాలని: 23 నెలలుగా చంఢీయాగం, నేటితో సంపూర్ణం
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ నిర్వహించిన శ్రీమహారుద్రసహిత ద్విసహస్ర చండీయాగం సోమవారంతో పరిసమాప్తమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో దాదాపు 23 నెలలుగా కొనసాగుతున్న ఈ యాగం పూర్ణాహుతితో సంపూర్ణమైంది.
'సరిలేరు నీకెవ్వరు'.. శృతి మించుతున్న మహేష్ సినిమా బడ్జెట్!
మహేష్ సినిమా అంటే రెమ్యునరేషన్, బడ్జెట్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. మహర్షి చిత్రానికి కూడా బడ్జెట్ ఎక్కువైందనే టాక్ వినిపించింది. కానీ సమ్మర్ సీజన్ కావడంతో ఆ చిత్రం గట్టెక్కేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో వినిపిస్తున్న బడ్జెట్ లెక్కలు షాకిచ్చే విధంగా ఉన్నాయి.
కియారా అద్వానీకి విజయ్ దేవరకొండ గిఫ్ట్..!
సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు చెబుతూ కియారా అద్వానీకి ఓ గిఫ్ట్ ని ప్రెజంట్ చేశాడు. ఆ గిఫ్ట్ ని సోషల్ మీడియావేదికగా అభిమానులతో పంచుకుంది కియారా.
కేసీఆర్ కు స్పీడ్ బ్రేక్ లు తప్పవు: నిప్పులు చెరిగిన విజయశాంతి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి. అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందనే నియంతృత్వ ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కోనేరు కృష్ణ కుటుంబసభ్యులు తనను ఏం చేస్తారోనని భయంగా ఉందని ఫారెస్ట్ ఆఫీసర్ అనిత అన్నారు. ఆదివారం కాగజ్నగర్ మండలం సార్సాలో మొక్కలు నాటేందుకు ట్రాక్టర్లతో చదును చేస్తున్న సమయంలో కొమరం భీమ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కృష్ణ తన అనుచరులతో కలిసి ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఫారెస్ట్ మహిళా అధికారి అనిత తీవ్రగాయాలపాలయ్యారు.
బిజెపిలో చేరుతున్నట్లు వార్త: భగ్గుమన్న కడియం, బహిరంగ లేఖ
తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై తెలంగాణ మాజీ డిప్యూటీ సిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ఆ వార్తపై మీడియాకు బహిరంగ లేఖ రాశారు. తాను బిజెపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తకు ఖండన ప్రచురించాలని డిమాండ్ చేశారు.
కోనేరు కృష్ణపై కేసీఆర్ సీరియస్, పోలీస్ అధికారులపై వేటు
కొమరంభీం జిల్లాలో అటవీశాఖ అధికారులపై దాడి చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ వైఎస్ ఛైర్మన్ కోనేరు కృష్ణపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు.
'ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా..' మెగాడాటర్ పై ట్రోల్స్!
మెగాడాటర్ నీహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నటిగా తన టాలెంట్ నిరూపించుకునే పనిలో పడింది. ఆమె నటించిన చిత్రాల్లో పద్దతిగానే కనిపించింది. బయట కూడా పెద్దగా గ్లామర్ షో చేయని ఈ బ్యూటీ తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో ఓ ఫోటో తీయించుకుంది నీహారిక.
నీ భర్తకు తమ్ముడిలా ఉన్నావ్.. హీరో భార్యని అవమానిస్తూ కామెంట్స్!
బాలీవుడ్ క్రేజీ హీరో ఆయుష్మాన్ ఖురానా సతీమణి తహీరా కశ్యప్ ఇటీవల రొమ్ము క్యాన్సర్ తో బాధపడ్డారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. మహిళలపై రొమ్ము క్యాన్సర్ లో అవగాహనా కల్పించేందుకు తహీరా సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు పెడుతూ వచ్చారు. ఆ సందర్భంలో ఆమె షేర్ చేరిన కొన్ని ఫోటోలు వివాదాస్పదం కూడా అయ్యాయి.
సౌందర్య రజనీకాంత్ పై ట్రోలింగ్.. ఫోటో డిలీట్!
ఇటీవల సౌందర్య రజనీకాంత్ తన కొడుడు వేద్ తో స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోతో సౌందర్య రజనీకాంత్ నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఓ వైపు చెన్నై నగరం నీటి సమస్యతో అలాడుతుంటే.. ఇలా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు షేర్ చేస్తావా అంతో అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
యాంకర్ ఝాన్సీపై వేధింపులు.. స్పందించిన మాజీ భర్త!
జోగినాయుడు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను ఝాన్సీని వేధించానని వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ఝాన్సీని పెళ్లి చేసుకున్న తరువాత ఎనిమిదేళ్ల పాటు సాఫీగా జీవితం సాగించామని వెల్లడించాడు.
రెజీనాతో ఎఫైర్.. గట్టిగా నవ్వేసిన కుర్ర హీరో!
రెజీనాతో గత కొంత కాలంగా ఒక కుర్రహీరో ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ హీరో ఎవరో కాదు యువ హీరో సందీప్ కిషన్ అని పలు వెబ్ సైట్లలో కథనాలు వెలువడ్డాయి. రొటీన్ లవ్ స్టోరీ సినిమాలో ఈ ఇద్దరు మొదటిసారి కలిశారు. అనంతరం రారా కృష్ణయ్య - నగరం - నక్షత్రం సినిమాల్లో కూడా కనిపించారు.
తాగి సెట్లో గొడవ చేసిన రాజేంద్రప్రసాద్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
తాజాగా జరిగిన 'ఓ బేబీ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు నటుడు రాజేంద్రప్రసాద్. తను చదువుకున్న వ్యక్తినని.. సీనియర్ ఎన్టీఆర్ లా పాత్రలో లీనమైపోయి నటిస్తుంటానని చెప్పారు
అమీషాపటేల్ కి కోర్టు నోటీసులు.. అరెస్ట్ తప్పదా..?
బాలీవుడ్ బ్యూటీ అమీషాపటేల్ తెలుగులో 'బద్రి' అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఫోటోషూట్లతో కాలం గడుపుతోంది. ఇప్పుడు ఈ భామకి కోర్టు కేసు మెడకు చుట్టుకుంది. ఓ ఫైనాన్షియర్ నుండి మూడు కోట్ల రూపాయలు అప్పు ఎగవేసినందుకు ఆమెకు కోర్టు సమాన్లు జారీ చేసింది.
బ్లేమ్ గేమ్ ఆడద్దంటోన్న అనసూయ.. రష్మి రిప్లై!
అనసూయ భరద్వాజ్, రష్మీ వీళ్లిద్దరూ తమ యాంకరింగ్తో జబర్ధస్త్ ప్రోగ్రామ్ కు ప్లస్ అయ్యారు. అలాగే... కేవలం యాంకర్గానే కాకుండా.. హీరోయిన్స్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ లుగా సినిమాల్లో తమ సత్తా చాటుతున్నారు. వీటికి మాత్రమే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై తమదైన శైలిలో సోషల్ మీడియాలో వివిధ అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా అనసూయ ప్రెజంట్ సొసీటీలోని జనాల భాధ్యతలేని తనంపై, ఇతురులపై నెపం వేయటం వంటి విషయాలపై తనదైన శైలిలో స్పందించారు.