Asianet News TeluguAsianet News Telugu

జగన్ సీఎం కావాలని: 23 నెలలుగా చంఢీయాగం, నేటితో సంపూర్ణం

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ నిర్వహించిన శ్రీమహారుద్రసహిత ద్విసహస్ర చండీయాగం సోమవారంతో పరిసమాప్తమైంది. 

YS jagan attends maha rudra sahitha chandi yagam in tadepalli
Author
Tadepalli, First Published Jul 1, 2019, 11:22 AM IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ నిర్వహించిన శ్రీమహారుద్రసహిత ద్విసహస్ర చండీయాగం సోమవారంతో పరిసమాప్తమైంది.  గుంటూరు జిల్లా తాడేపల్లిలో దాదాపు 23 నెలలుగా కొనసాగుతున్న ఈ యాగం పూర్ణాహుతితో సంపూర్ణమైంది.

ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్ చేతుల మీదుగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios