Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో మాదే అధికారం, తెలంగాణలో ఇలా చేశారు: బాబు వ్యాఖ్యలు

ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయిందని ఏపీ  సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. 

chandrababunaidu sensational comments on election commission in new delhi
Author
Amaravathi, First Published Apr 14, 2019, 1:32 PM IST

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయిందని ఏపీ  సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తాను  వెయ్యి శాతం తిరిగి అధికారంలోకి రానున్నట్టు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

ఈవీఎంలు, ఎన్నికల సంఘం అనుసరిస్తున్న పద్దతులపై చర్చించేందుకు బీజేపీయేతర పార్టీలు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఆదివారం నాడు సమావేశమయ్యారు.

ఈవీఎంల వివాదంతో పాటు వీవీప్యాట్‌లను 50 శాతం లెక్కించాలనే విషయమై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసే విషయమై చర్చించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఓట్లను తొలగించారని ఆయన గుర్తు చేశారు.. ఎన్నికల తర్వాత ఈసీ  క్షమాపణ చెప్పి సరిపెట్టారన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ పోలింగ్‌  రోజున నమోదైన పోలింగ్ శాతానికి కౌంటింగ్ చేసిన ఓట్ల శాతానికి మధ్య తేడా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.ఏపీ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం జరిగిన పోలింగ్‌లో  ఏపీ సీఈఓ ద్వివేది ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో ఈవీఎంలు పనిచేయలేదని ఆయన గుర్తు చేశారు.

ఏపీలో పోలింగ్ రోజున ఈసీ అనుసరించిన తీరుపై ఓటర్లు ఈసీ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని ఆయన ప్రస్తావించారు. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. రాష్ట్రంలోని మూడు పోలింగ్ కేంద్రాల్లో మరునాడు నాలుగున్నర గంటల వరకు కొనసాగిందని ఆయన వివరించారు.

వీవీప్యాట్లు కేవలం మూడు సెకన్లు మాత్రమే కన్పించాయని బాబు చెప్పారు. ఈవీఎంల రిపేర్ చేసే వారెవరు... ఎక్కడి నుండి వారిని నియమించుకొన్నారనే విషయమై స్పష్టత లేదన్నారు. బ్యాలెట్ పేపర్ల లెక్కింపు కోసం ఆరు రోజులు పడుతోందనే విషయంలో వాస్తవం లేదన్నారు. 

దర్యాప్తు సంస్థలతో తమ మీద దాడులకు పాల్పడ్డారని చంద్రబాబునాయుడు విమర్శించారు. తమ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యాయయని ఆయన గుర్తు చేశారు. తాను ఎన్నికల్లో ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నందున ఈ  అంశాన్ని లేవనెత్తినట్టుగా కొందరు చేస్తున్న ప్రచారాన్ని బాబు తప్పుబట్టారు. ఏపీ రాష్ట్రంలో వెయ్యి శాతం తాను అధికారంలోకి తిరిగి వస్తాననే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

తమ అధికారులను బది చేశారని, సీఎస్‌ను కూడ బదిలీ చేశారని ఆయన గుర్తు చేశారు. కనీసం ఎవరినీ అధికారిగా నియమించే విషయమై తమతో సంప్రదించలేదన్నారు.ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు చోటు చేసుకొన్నాయని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. ఈవీఎంల వైఫల్యాలపై ఈ సమావేశంలో చర్చించారు.

సంబంధిత వార్తలు

స్ట్రాంగ్‌ రూమ్‌ నుండి ఈవీఎంల తరలింపు: కృష్ణా జిల్లాలో కలకలం

అనంత సీట్లన్నీ మావే:జేసీ దివాకర్ రెడ్డి

నేనేసిన ఓటు నాకు పడిందా: చంద్రబాబు అనుమానం

మే 23 తర్వాత ముహుర్తం చూసుకొని ప్రమాణం చేస్తా: బాబు

సీఎస్ సుబ్రమణ్యం కోవర్టు: చంద్రబాబు సంచలనం

సైలెంట్ వేవ్, జగన్‌కు వ్యతిరేకమే: చంద్రబాబు అంచనా

ప్రచారానికి మూడు రోజుల సెలవు అందుకే: జగన్‌పై చంద్రబాబు

సీఈఓ ద్వివేదికే దిక్కులేదు, సామాన్యుల పరిస్థితి ఏమిటీ:చంద్రబాబు

ముందస్తు కుట్ర చేశారు, అయినా...: చంద్రబాబు

వైసీపీ అభ్యర్థి ప్రకాష్‌రెడ్డికి పరిటాల సునీత వార్నింగ్

ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

క్యూను దాటేసి ఓటేసిన పవన్ కళ్యాణ్: ఓటర్ల అసహనం

మూడు ఓట్ల కోసం చంద్రగిరి సెగ్మెంట్‌లో హైడ్రామా

150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి

పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

 

Follow Us:
Download App:
  • android
  • ios