చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి
తమను రెచ్చగొడితే చేతులు ముడుచుకొని కూర్చోలేమని ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్విఖ్యాత్ రెడ్డి హెచ్చరించారు. తమ అనుచరులు ఇద్దరిని వదిలిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు.
ఆళ్లగడ్డ: తమను రెచ్చగొడితే చేతులు ముడుచుకొని కూర్చోలేమని ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్విఖ్యాత్ రెడ్డి హెచ్చరించారు. తమ అనుచరులు ఇద్దరిని వదిలిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు.
గురువారం నాడు ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్ధి నాని తమ అనుచరులు ఇద్దరిని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద సోదరి నాగ మౌనిక రెడ్డితో కలిసి ఆయన ధర్నాకు దిగారు.
తమ కార్యకర్తలను వైసీపీ అభ్యర్ధి కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. తమను రెచ్చగొడితే ఎందుకు చూస్తూ ఊరుకోవాలని ఆయన ప్రశ్నించారు.
ఆళ్లగడ్డలో వైసీపీ నేతలు తనపై రాళ్లతో దాడికి దిగారని భూమా అఖిలప్రియ సోదరి నాగ మౌనిక రెడ్డి ఆరోపించారు. తమ కార్ల అద్దాలను ధ్వంసం చేశారన్నారు. వైసీపీ నేతలు తమ వాహనాల్లో మారణాయుధాలను పెట్టుకొని తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగకుండా చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
ఓటర్లను భయబ్రాంతులను చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసు శాఖ సరిగా వ్యవహరించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అందరికీ ఒకే రకంగా ఉండాలని ఆమె పోలీసులను కోరారు.తమకే రక్షణ లేకపోతే సామాన్యులకు ఎలా రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు
ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది
రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా
తలుపులేసుకొని బూత్లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల
తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి
ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్
మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే
చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత
టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు
ఏపీ పోలింగ్లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు
చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి
ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు
దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి
ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్
బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్
ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు
ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్
మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్
ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు
తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్లో తొలిసారిగా ఇలా..
ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.