Asianet News TeluguAsianet News Telugu

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: టీడీపీ కార్యకర్త మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని మీరాపురంలో  జరిగిన గొడవలో టీడీపీ కార్యకర్త సిద్దా భాస్కర్ రెడ్డి మృతి చెందారు.  నలుగురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

tdp leader died after clashes between tdp, ysrcp in tadipatri
Author
Tadipatri, First Published Apr 11, 2019, 12:31 PM IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని మీరాపురంలో  జరిగిన గొడవలో టీడీపీ కార్యకర్త సిద్దా భాస్కర్ రెడ్డి మృతి చెందారు.  నలుగురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు..  పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవ భాస్కర్‌రెడ్డి మరణానికి  కారణమైంది.

మరో వైపు ఇదే ఘర్షణలో గాయపడిన వైసీపీ కార్యకర్తల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.అనంతపురం తాడిపత్రి నియోజకవర్గంలో మీరాపురంలో పోలింగ్ సందర్భంగా గురువారం నాడు వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నలుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీకి చెందిన భాస్కర్ రెడ్డి మృతి చెందారు.

పోలింగ్ కేంద్రం వద్ద చిన్నగా ప్రారంభమైన గొడవ తీవ్రంగా మారింది. రెండు వర్గాలు ఒకరిపై మరోకరు దాడికి పాల్పడ్డారు. రాళ్లు రువ్వుకొన్నారు. ఈ దాడిలో గాయపడిన భాస్కర్ రెడ్డిని  అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందారు.

 ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నలుగురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.ఈ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.


సంబంధిత వార్తలు

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios