రాహుల్ తలకు లేజర్ లైట్: ఫోన్ లైటేనన్న కేంద్రం
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్గాంధీ రక్షణ విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఓ లేఖ రాసింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్గాంధీ రక్షణ విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఓ లేఖ రాసింది.
బుధవారం నాడు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో రాహుల్ మాట్లాడే సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన నుదుటిపై లేజర్ ఫోకస్ చేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. స్నిప్పర్ రైఫిల్కు మాత్రమే ఈ తరహా లేజర్ లైట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఓ లేఖ రాసింది. యూపీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది.రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కూడ హత్యకు గురైన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలపై కేంద్రం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీఐజీని ఈ విషయమై వివరణ కోరింది.
అయితే రాహుల్ గాంధీపై ఫోకస్ చేసిన లేజర్ లైట్ సెల్పోన్ నుండి వచ్చిందని ఎస్పీజీ డీఐజీ చెప్పారని కేంద్ర హోం మంత్రిత్వశాఖ చెబుతోంది.కేంద్ర హోంమంత్రిత్వశాఖకు రాసిన లేఖలో రాహుల్గాంధీ తలకు లేజర్ లైట్ ఫోకస్ చేసిన వీడియోను కూడ కాంగ్రెస్ పార్టీ అందించింది.
అయితే కేంద్ర హోంమంత్రిత్వశాఖకు రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ సంతకం చేశారు. ఈ వీడియో పుటేజీని పరిశీలించిన మీద ఒక గన్కు సంబంధించిన లేజర్ లైట్గా సెక్యూరిటీ సిబ్బంది అభిప్రాయపడినట్టుగా ఆయన చెప్పారు.
అయితే తాము ఎలాంటి లెటర్ రాలేదని కేంద్ర హోంమంత్రిత్వశాఖ చెబుతోంది.అయితే ఈ వీడియో క్లిప్పింగ్ను ఎస్పీజీ చీఫ్ పరిశీలించిన మీదట కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫోటోగ్రాఫర్ సెల్ఫోన్ నుండి వచ్చిన లైట్గా చెప్పారు.
సంబంధిత వార్తలు
ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్
పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి
చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి
ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది
రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా
తలుపులేసుకొని బూత్లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల
తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి
ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్
మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే
చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత
టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు
ఏపీ పోలింగ్లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు
చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి
ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు
దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి
ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్
బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్
ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు
ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్
మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్
ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు
తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్లో తొలిసారిగా ఇలా..
ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి