Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ అభ్యర్థి ప్రకాష్‌రెడ్డికి పరిటాల సునీత వార్నింగ్

రాఫ్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి భయంతో  వైసీపీ తమపై దాడులకు దిగిందని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ ఇలాగే దాడులు చేస్తే తాము కూడ ఎంతకైనా తెగిస్తామని సునీత హెచ్చరించారు.

minister paritala sunitha warns to ysrcp candidate prakash reddy
Author
Anantapuram, First Published Apr 12, 2019, 12:41 PM IST


అనంతపురం: రాఫ్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి భయంతో  వైసీపీ తమపై దాడులకు దిగిందని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. వైసీపీ ఇలాగే దాడులు చేస్తే తాము కూడ ఎంతకైనా తెగిస్తామని సునీత హెచ్చరించారు.

ఈ మేరకు తన కొడుకు పరిటాల శ్రీరామ్‌తో కలిసి జిల్లా ఎస్పీ ఆశోక్‌కుమార్‌కు గురువారం నాడు ఆమె వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

రాఫ్తాడు వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అతని సోదరులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని పరిటాల సునీత చెప్పారు. పోలింగ్ బూత్‌ల్లో  ఓటింగ్‌ను పరిశీలించేందుకు వచ్చిన పరిటాల శ్రీరామ్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారని ఆమె చెప్పారు.  

వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలింగ్ కేంద్రాల సందర్శనకు వచ్చిన సమయంలో టీడీపీ ఎక్కడ కూడ అడ్డుకోలేదన్నారు. ప్రకాష్ రెడ్డి మీకు రాజకీయంగా భవిష్యత్తు ఉంది  దాన్ని పాడు చేసుకోవద్దన్నారు. తాము ఫ్యాక్షన్ వదిలి 14 ఏళ్లు అవుతోందన్నారు. నియోజకవర్గంలో శాంతి ఉండాలనేది తమ లక్ష్యంగా ఆమె చెప్పారు.

వైసీపీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డి రామగిరికి వచ్చినా కూడ తాము అడ్డుకోలేదన్నారు. శ్రీరామ్ తోపుదుర్తికి వస్తే దాడులకు దిగడాన్ని ఆమె తప్పుబట్టారు.ఎవరూ కూడ గొడవలకు వెళ్లొద్దని ఆమె తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. వైసీపీ నేతలు ఇలాగే ప్రవర్తిస్తే తాము కూడ ఎంతకైనా సిద్దమని  సునీత హెచ్చరించారు.  వైసీపీ దాడుల్లో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆమె పరామర్శించారు.

 

సంబంధిత వార్తలు

ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

క్యూను దాటేసి ఓటేసిన పవన్ కళ్యాణ్: ఓటర్ల అసహనం

మూడు ఓట్ల కోసం చంద్రగిరి సెగ్మెంట్‌లో హైడ్రామా

150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి

పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios