
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరుకొంది.పార్టీ టిక్కెట్టు దక్కని అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ బుజ్జగించనున్నారు. సుమారు 15కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు లేదా మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గురువారం నాడు కూడ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. నవంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి,షబ్బీర్ అలీ, మాజీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ కుంతియాలు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో రెండు రోజులుగా సమావేశమయ్యారు.
ఇప్పటికే 57 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసింది. మరో 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రెండు రోజులుగా కసరత్తు చేస్తోంది.
కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు పేర్లను కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుల ముందు చర్చకు వచ్చాయి. మెదక్ లో విజయశాంతి, శశిదర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ పార్టీ పరిశీలించింది. దేవరకొండ నుండి బాలూనాయక్, బిల్యానాయక్ తో పాటు మరోకరి పేరును పరిశీలించారు.
సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లను పరిశీలించారు.ఇలా పలు నియోజకవర్గాల నుండి పలువురి పేర్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిశీలించింది.
కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే దేవరకొండ టిక్కెట్టును రవీంద్రనాయక్ కు కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.
బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అయితే 20 నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించాల్సిన పరిస్థితులు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది.
సుమారు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించింది. గురువారం నాడు ఉదయం పూట పోటీ తీవ్రంగా ఉన్న ఆశావహులతో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చర్చించనున్నారు.
గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ పార్టీ 9వ తేదీన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.అసంతృప్తులను రాహుల్ గాంధీ బుజ్జగించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే నామినేటేడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వనున్నట్టు రాహుల్ హామీ ఇవ్వనున్నారు.
సంబంధిత వార్తలు
సీట్ల లొల్లి: కాంగ్రెస్పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్కు కోదండరామ్
టీజేఎస్కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?