Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఐపీఎస్ అధికారిణికి జగన్ బంధువుతో పెళ్లి?: మరిన్ని వార్తలు

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

Top stories of the day
Author
Hyderabad, First Published Jul 24, 2019, 6:02 PM IST

తెలంగాణ ఐపీఎస్ అధికారిణికి జగన్ బంధువుతో పెళ్లి?!

telangana IPS officer coming to ap cm ys Jagan's house as an Daughter-in-law

వరుడు సీఎం జగన్ కు స్వయానా బంధువు కావడంతో ఈ పెళ్లిపట్ల చాలా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఎవరా బంధువు, ఎవరా వరుడు అంటూ అంతా చర్చించుకుంటున్నారట. కొందరైతే సోషల్ మీడియాలోకి వెళ్లి వైయస్ జగన్ కుటుంబం, బంధువుల పుట్టుపూర్వోత్తరాలు వెతికే పనిలో పడ్డారట. 

 

వైద్యులు చెప్పారు, ఏ క్షణమైనా నేను పోవచ్చు: అక్బరుద్దీన్

mim mla Akbaruddin Owaisi emotional comments in karimnagar

కరీంనగర్: తాను  ఏ క్షణమైనా చనిపోవచ్చని వైద్యులు చెప్పారు, కానీ దాని మీద నాకేం బాధ లేదు,  కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి ఎంపీగా గెలవడమే తనకు బాధ కల్గించిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు.

 

రోజా నాకు ఫ్రెండ్, పోటీదారులం కాదు: ప్రియా రామన్

cine actress priya raman interesting comments on roja

సినీ నటి ప్రియారామన్ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రియా రామన్ రాజకీయాల్లోకి రానున్నారు. త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

 

వైసీపీ వల్ల మేలు కంటే కీడే ఎక్కువ : బీజేపీ నేత రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు

bjp national general secretory ram madhav sensational comments on ysr congress party

ఏపీ ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ భుజంతో భుజం కలిసి పనిచేసే నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో 25 ఏళ్ల పాటు మోదీయే ప్రధానిగా ఉంటారన్నారు. 

 

ఏపీ మంత్రిని బతిమిలాడిన జగన్: దండం పెట్టినా కరుణించని జయరాం

ap minsiter jayaram praises cm ys jagan creates laughter riot assembly

మంత్రి గుమ్మనూరు జయరాం పొగడ్తలతో ముంచెత్తుతుండటంతో సీఎం జగన్ దండంపెట్టి ఆపన్నా అంటూ బతిమిలాడుకున్నారు. ఇక ఆపన్నా ఆపన్నా అంటూ బతిమిలాడినా మంత్రి మాత్రం ఆగలేదు. తన పొగడ్తల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉండటంతో సభలో మళ్లీ నవ్వులు వెలిశాయి.
 

 

వదిలే ప్రసక్తేలేదు, వారంతా జైలుకే: హోంమంత్రి సుచరిత సంచలన నిర్ణయం

ap home minister mekathoti sucharitha serious comments on call money cases

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాల్ మనీ కేసులపై పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్ మనీ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తాము మాత్రం వదిలిపెట్టేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.  

 

జషిత్ నా వద్దే ఉన్నాడు: తండ్రికి ఢిల్లీ నుండి ఫోన్

unknown person phoned to four year old jashith's father venkataramana

మండపేట: మండపేటలో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల జషిత్ దొరికాడంటూ గుర్తు తెలియని వ్యక్తి ఢిల్లీ నుండి బుధవారం నాడు ఫోన్ చేశారు. తన ఖాతాలో రూ. 5వేలు జమ చేస్తే బాలుడిని తీసుకొస్తానని  గుర్తుతెలియని వ్యక్తి జషిత్ తండ్రికి ఫోన్ చేశాడు.

 

చంద్రబాబు ఆందోళనంతా దీని గురించే.. విజయసాయి కామెంట్స్

mp vijayasai reddy comments on chandrababu over capital amaravathi

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకి ప్రజల సమస్యల గురించి కొంచెం కూడా ఆందోళన లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

 

జగన్ కు చెక్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ దోస్తీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన సారథి పవన్ కల్యాణ్ ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ దూకుడుకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ఆ ఇరువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చేతులు కలిపేందుకు వారు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన సారథి పవన్ కల్యాణ్ ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ దూకుడుకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ఆ ఇరువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చేతులు కలిపేందుకు వారు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. 

 

ఎపి అసెంబ్లీ: చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ap chief minister ys jagan slams on chandrababunaidu in assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం నాడు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం సాగింది.విపక్షనేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

 

అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల వాకౌట్

tdp mlas walkout from andhra pradesh assembly

అమరావతి:  ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు మంగళవారం నాడు వాకౌట్ చేశారు. రైతు సమస్యలపై చర్చించేందుకు తమకు అవకాశం కల్పించడం లేదని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు  బుధవారం నాడు శాసనసభ నుండి వాకౌట్ చేశారు.

 

బొల్లినేని శ్రీనివాస్ గాంధీకీ ఈడీ ఉచ్చు.. వెనక జగన్ హస్తం?

ED cases against Srinivasa Gandhi

శ్రీనివాస గాంధీపై ఈడీ అధికారులు మనీల్యాండరింగ్ కేసు నమోదు చేశారు. గాంధీ... భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నెల 8వ తేదీన శ్రీనివాస గాంధీపై సీబీఐ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

 

నగ్నంగా ఫోటోలు దిగి పంపాలని బాలికకు బెదిరింపులు

youth arrested for blackmailing girl to send her naked photos

ఓ బాలికకు మిస్డ్ కాల్ ద్వారా నెల్లూరుకు చెందిన శ్రీనివాసరావు అనే యువకుడు పరిచయం అయ్యాడు.మూడు నెలలుగా వారు ఒకరితో మరొకరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. ఇటీవల శ్రీనివాసరావు బాలికను తన అర్థనగ్న ఫోటోలు పంపించాలని కోరాడు. 

 

ఎర్రమంజిల్ కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

telangana high court comments on errum manzil

హైదరాబాద్: ప్రస్తుతమున్న అసెంబ్లీలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పటికీ ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించాల్సిన అవసరం ఏముందని తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

 

పొరపాటున మేసేజ్: జూనియర్‌ను చితకబాదిన సీనియర్లు

seniors attacks on student shiva ganeshan in khammam

ఖమ్మం: చిన్న విషయానికి జూనియర్ విద్యార్ధిపై సీనియర్లు తీవ్రంగా పిడిగుద్దులు గుద్ది చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన ఖమ్మం  జిల్లాలో  చోటు చేసుకొంది.ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

శిశుపాలుడి కంటే ఎక్కువ తప్పులు: కేసీఆర్ పై విజయశాంతి

congress leader vijayashanthi fires on kcr

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై ఆమె మండిపడ్డారు. మున్సిపల్ బిల్లును గవర్నర్ వెనక్కు పంపడంపై విజయశాంతి స్పందించారు.

 

విషాదం...ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

family commits suicide in miryalaguda

ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం ప్రాణాలు విడిచింది.  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే... మిర్యాలగూడలోని సంతోష్ నగర్ కి చెందిన పారేపల్లి లోకేష్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నాడు.

 

కామెడీ పీస్ అనుకోవద్దు.. జాఫర్ కు మహేష్ మామూలు కౌంటర్ ఇవ్వలేదుగా!

Comedian Mahesh gives strong counter to Jaffar

బిగ్ బాస్ సీజన్ 3లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంట్లో ఉన్న సభ్యులు వాళ్లలో వాళ్లే చూసుకునేలా నామినేషన్ ప్రక్రియని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ న్యూస్ యాంకర్ జాఫర్, యూట్యూబ్ తో పాపులర్ అయిన కమెడియన్ మహేష్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. 

 

ఉదయ్ కిరణ్ కు నేనే పోటీ.. అప్పటి నుంచే తొక్కేయాలని ప్లాన్.. హీరో ఆకాష్!

Hero Akash sensational comments on Tollywood

ఇస్మార్ట్ శంకర్ చిత్ర కథ తనది అంటూ సడెన్ గా ముందుకు వచ్చారు హీరో ఆకాష్. ఆనందం చిత్రంతో ఆకాష్ తెలుగు ప్రేక్షకుల బాగా చేరువయ్యాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనందం ఘనవిజయం సాధించింది. ఇస్మార్ట్ శంకర్ చిత్ర వివాదంతో మరోసారి ఆకాష్ వార్తల్లో నిలిచాడు. 

 

రానాకి తన తల్లి కిడ్నీ దానం చేసిందా..?

Truth About Rana Daggubati Kidney Transplant Rumours

దగ్గుబాటి రానా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రానా కిడ్నీ మార్పిడి సర్జరీ కోసమే వెళ్లారని అన్నారు. అయితే తాజాగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందనే వార్త బలంగా వినిపిస్తోంది. రానాతో పాటు ఆయన తల్లి లక్ష్మి, చెల్లెలు మాళవిక అమెరికాలోనే ఉన్నారట.

 

బిగ్ బాస్ షో నిర్వాహకుల అరెస్ట్ పై హైకోర్టు నిర్ణయం!

High Court's order on stopping 'Bigg Boss 3' and arresting organizers

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్‌ బాస్ షో నిర్వాహకులకు నాంపల్లి కోర్టులో పెద్ద ఊరట లభించింది. బిగ్‌ బాస్ కోఆర్డినేటర్లు అభిషేక్, రవికాంత్, రఘుకు ముందస్తు 
 

 

'శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తారా..?' అభిమానుల రచ్చ!

bigg boss 3: memes on sreemukhi

బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖికి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఆమె హౌస్ లోకి వెళ్లకముందు నుండే ఆర్మీలు తయారయ్యాయి. ఆమె టైటిల్ కొట్టే వరకు హౌస్ లోనే ఉంచాలని అభిమానులు ఆరాటపడుతున్నారు.

 

బిగ్ బాస్ 3లో హాట్ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. తొలివారం ఆమె బలి ?

hot heroine wild card entry in Bigg boss 3

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 తొలివారంలోనే రసవత్తరంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య వాళ్లలో వాళ్ళకే గొడవలు పెరిగేలా నామినేషన్ ప్రక్రియని ప్లాన్ చేశారు. షోపై మరింత ఆసక్తి పెంచేలా త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

 

బాలయ్యకు హీరోయిన్ గా మహేష్ సోదరి.. ఆత్మహత్య చేసుకుంటామన్న ఫ్యాన్స్!

Mahesh Babu Sister Manjula missed Balakrishna movie

మహేష్ బాబు సోదరి మంజుల గురించి తెలుగు సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది. దర్శకురాలిగా, నిర్మాతగా గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆరెంజ్ లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. తాజాగా మంజుల ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 

 

సొంత అక్కే నన్ను చంపాలని చూస్తోంది.. సాక్షి శివానంద్ పై ఆరోపణలు!

Shilpa Anand says she has filed attempt to murder case against sister, her mom-in-law

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాక్షి శివానంద్ పై తన సోదరి శిల్పా ఆనంద్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సాక్షి తనను చంపాలని చూస్తోందని శిల్పా ఆనంద్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

నన్ను పెళ్లి చేసుకుంటారా? మాధవన్ కి పెళ్లి ప్రపోజల్!

R Madhavan gets wedding proposal from 18-year-old girl

ఒకప్పుడు లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్ కి ఇప్పటికీ ఆ క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. అందుకే ఓ యువతి అతడిని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది. అసలు విషయంలోకి వెళితే.. మంగళవారం నాడు మాధవన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ సెల్ఫీ పోస్ట్ చేశారు.

 

మన హీరోల నోట.. అదిరిందిగా తెలంగాణ మాట!

ఒకప్పుడు హీరోలంటే డాన్స్ లు బాగా చేస్తున్నారా..? ఫైట్స్ బాగా  చేస్తున్నారా..? ఎమోషనల్ సీన్స్ బాగా పండిస్తున్నారా..? అనే  చూసేవారు. కానీ ఇప్పుడు హీరోలు నటనలో సహజత్వం చూపిస్తేనే  కానీ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం లేదు. అందుకే ఆడియన్స్ ని  ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో  తెలుగులో భాషలో ఉన్న అన్ని యాసలలో మాట్లాడుతూ మనల్ని  అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా తెలంగాణా యాసలో  మాట్లాడి మనల్ని మెప్పించిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం!

ఒకప్పుడు హీరోలంటే డాన్స్ లు బాగా చేస్తున్నారా..? ఫైట్స్ బాగా చేస్తున్నారా..? ఎమోషనల్ సీన్స్ బాగా పండిస్తున్నారా..? అనే చూసేవారు. 

 

'బిగ్ బాస్ 3' కేసులో స్టార్ మాకి నోటీసులు!

bigg boss 3 show controversy

కొద్దిరోజుల క్రితం యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ షోలో  కాస్టింగ్ కౌచ్ ఉందంటూపోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ షోపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు స్టార్ మా ఛానెల్ సంస్థ అడ్మిన్ హెడ్ శ్రీధర్ కి మంగళవారం నాడు నోటీసులిచ్చారు. 

 

నా కుక్కకు అక్రమ సంబంధం: లేఖ రాసిన యజమాని

A dog in Kerala was abandoned by her owner over an illicit relationship she had developed with a neighborhood pooch

తిరువనంతపురం:తన పెంపుడు కుక్కకు ఊర కుక్కతో అక్రమ సంబంధం ఉందని  యజమాని ఆ కుక్కను వదిలేశాడు. ఆ కుక్క ప్రస్తుతం పీపుల్ ఫర్ ఎనిమల్స్ అనే స్వచ్ఛంధ సంస్థ సంరక్షణలో ఉంది. 

 

దేశంలో దాడులపై సెలబ్రిటీల ఆవేదన: చర్యలపై ప్రధాని మోదీకి 49 మంది ప్రముఖులు లేఖ

49 big celebrities write a letter to pm over incidents of lynching,seek exemplary punishment for perpetrators

న్యూఢిల్లీ: దేశంలో అసహనం, మూకదాడులను నిర్మూలించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి 49 మంది సెలబ్రిటీలు లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన వారిలో ప్రముఖ సింగర్ శుభా ముద్గల్, నటి కొంకణా సేన్ శర్మ, మరియు దర్శకుడు శ్యామ్ బెనగల్, మణిరత్నం, క్రీడారంగం నుంచి అనురాగ్ కశ్యప్ లు ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios