బాబు ఇంటి వద్ద డ్రోన్ రచ్చ: మరిన్ని వార్తలు
నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
బాబు బాధ్యత కూడా మాదేనన్నా...అధికారులను అడ్డుకుంటారా: ఆళ్ల
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి ప్రతిపక్షనేత చంద్రబాబుపై మండిపడ్డారు. ఉండవల్లి కరకట్ట వెంబడివున్న అక్రమ కట్టడాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల కారణంగా కరకట్టలు బలహీనపడుతున్నాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో టీడీపీ క్లోజ్, భవిష్యత్ బీజేపీదే: ఎంపీ గరికపాటి
తెలంగాణ రాష్ట్రానికి దశ, దిశ చూపే పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అవసరం తప్పదని చెప్పుకొచ్చారు.
డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్
మాజీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు డీజీపీ గౌతం సవాంగ్ కు ఫోన్ చేశారు. తన నివాసం పై డ్రోన్ కెమెరాలను ఉపయోగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
అన్నా క్యాంటీన్లు తెరిచే వరకు ఉద్యమం... ట్విట్టర్ లో చంద్రబాబు
టీడీపీపై కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయవచ్చని భావిస్తోందంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలను కష్ట పెట్టడాన్ని చూసి టీడీపీ సహించలేకపోతోందన్నారు.
సోదరి ప్రేమకు ఈ స్టార్ హీరోలు దాసోహం!
వెండితెరపై మన కథానాయకులకు అక్కాచెల్లెళ్లుగా చాలా మంది తారలు నటించారు. అయితే వాళ్ల రియల్ లైఫ్ లో వెన్నంటే ఉండి సపోర్ట్ అందించిన సిస్టర్స్ కూడా ఉన్నారు. మన హీరోలకు సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉన్న సిస్టర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం!
అంత డబ్బు తీసుకొని డైరెక్టర్ తో ఆడుకున్న యాంకర్ అనసూయ!
అనసూయ ప్రధాన పాత్రలో 'కథనం' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి రాజేష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది.
అనుష్కతో ఎఫైర్.. మండిపడ్డ ప్రభాస్!
ప్రభాస్ ఎన్ని సార్లు అనుష్క విషయంపై క్లారిటీ ఇస్తున్నా.. రూమర్లు మాత్రం ఆగడం లేదు. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, కేవలం స్నేహితులు మాత్రమేనని ఒకటికి పదిసార్లు చెబుతున్నా మీడియా మాత్రం ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తూనే ఉంది.
డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు, వీడియోలు తీయడంపై ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది.
రాయపాటి యూటర్న్... బీజేపీకాదు, వైసీపీలోకి..?
ఇందుకు కారణం లేకపోలేదు. మొన్నటి వరకు వైసీపీ పై విమర్శలు చేసిన రాయపాటి.. తాజాగా ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయపాటి ప్రశంసలు కురిపించారు. జగన్ పాలన చాలా బాగుందంటూ కితాబు ఇచ్చారు.. జగన్ పథకాలను కూడా మెచ్చుకున్నారు.
చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ
అమరావతి: చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై శుక్రవారం నాడు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు తరిమికొట్టారు.
స్కిన్ షో, సెక్సీ లుక్స్ తో మాయ చేస్తోన్న బ్యూటీ!
పలు యాడ్ ఫిలిమ్స్ లో మెరిసి వాటి ద్వారా గుర్తింపు తెచ్చుకుంది నటి అమైరా దస్తూర్.
అప్పుడలా ఇప్పుడు ఇలా, మీరు మారిపోయారు: వైసీపీపై బీజేపీ చీఫ్ కన్నా
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీతో ఎన్నో పనులు చేయించుకున్న వైసీపీ ఇప్పుడు అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరుల భరతం పడతాన్న జగన్ ఎంతమంది అవినీతి పరులను వెలికితీశారో చెప్పాలని నిలదీశారు.
వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్
డ్రోన్ల సాయంతో ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచా వేస్తున్నామని అందులో తప్పేంటో చెప్పాలని నిలదీశారు. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్లను వినియోగిస్తున్నట్లు మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు. ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఆ పార్టీ నాపై ఒత్తిడి తెస్తోంది, ఒకేసారి మీద పడకండి ... జనసేన అధినేత పవన్
ఎవరు ఎంత ఒత్తిడి చేసినా.. తమ జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయనని ప్రకటించారు. జాతి సమగ్రతను కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన అని అందుకే జనసేనను ఏ పార్టీలోనూ కలపమని స్పష్టం చేశారు.
డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు
డ్రోన్లతో విజువల్స్ తీస్తున్న వారిని తాము పట్టుకున్న పోలీసులు వారిని తప్పించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. ఇకపోతే తనపై ఓ సీఐ దైర్జన్యం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ టీడీ జనార్థన్. చంద్రబాబు నివాసంలోకి పోలీసు అధికారితోపాటు మరో ఇద్దరు వెళ్లారని వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రోన్ల వినియోగం వెనుక మర్మం ఏంటో స్పష్టం చేయవాలని జనార్థన్ డిమాండ్ చేశారు.
ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు: గవర్నర్ తో కేసీఆర్ మాట ఇదీ....
హైదరాబాద్: ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల విషయంలో కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించినట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.
కొడతారేమో: గవర్నర్, రేవంత్ మధ్య ఆసక్తికరం
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ నరసింహాన్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది. కొడతారని భయపడి రాలేదని రేవంత్ వ్యాఖ్యలతో ఎట్ హోం కార్యక్రమంలో అంతా నవ్వారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా సచివాలయం కడతాం: స్పష్టం చేసిన కేసీఆర్
ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణకు కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహాన్ రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు
అర్థరాత్రి ఓయూ లేడీస్ హాస్టల్ లోకి దూరిన యువకుడు... యువతిపై...
హాస్టల్ వెనుకవైపు ఉన్న గోడను దూకి ఓ యువకుడు లోపలికి వచ్చాడు. బాత్రూంలోకి యువతి వెళ్లడాన్ని చూసి బయట నుంచి గడిపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత బాత్రూం డోర్ తెరుద్దామని యువతి ఎంత ప్రయత్నించినా.. రాలేదు. దీంతో... యువతి గట్టిగా డోర్ బాదింది.
నటనకు సమంత బ్రేక్.. ప్రెగ్నెన్సీ కారణమా..?
పాకెట్ మనీ కోసం చిన్నచిన్న వేడుకల్లో సహాయ కార్యక్రమాలు చేస్తూ నటిగా మారింది ఈ బ్యూటీ. బానాకాత్తాడి చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసినా, తెలుగులో నటించిన ఏ మాయచేసావే చిత్రంతో విజయాన్ని అందుకుంది. తరువాత తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ హిట్ చిత్రాల నాయకిగా రాణిస్తున్నారు.
కొండపై రాజకీయాలొద్దు.. రాజేంద్ర ప్రసాద్ కు పృథ్వీ కౌంటర్
సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గురించి ఊహించని విధంగా కామెంట్స్ చేశారు. ఇటీవల తిరుమల కొండకు వచ్చిన రాజేంద్రప్రసాద్ రాజకీయాల గురించి స్పందించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల్లో ఓటమి... కన్నీళ్లు పెట్టుకున్న కేఈ కృష్ణమూర్తి
ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తానని చెప్పారు. కాగా... వచ్చే ఎన్నికల్లో తన కుమారుడి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తానని..అందుకు సహకరించాలని ఆయన కార్యకర్తలను కోరారు. వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా... కార్యకర్తలు పార్టీని వీడకుండా ఉండటం అభినందనీయమన్నారు. కార్యర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్
డ్రోన్ కమెరాతో చంద్రబాబునాయుడు నివాసంపై ఫోటోలు, వీడియోలు తీయడాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు.
చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు
కృష్ణా నది కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వరద ఉతిని రెవెన్యూ అధికారులతో కలిసి అంచనా వేశారు. చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాస భవనం మెట్ల దాకా వరద నీరు చేరింది.
చిరు గెటప్ పై మీమ్స్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!
రీసెంట్ గా చిరంజీవి నటించిన 'సై రా' మేకింగ్ వీడియో విడుదలైంది. ఆ వీడియో చివరిలో చిరంజీవి కత్తి పట్టుకొని, ఆగ్రహంతో ప్రత్యర్ధిని నరికేస్తూ కనిపించారు. ఆ సీన్ లో చిరంజీవి జుట్టు మొహం మీదకు పడుతూ, మోహంలో రౌద్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
'సాహో' : ఆ థియేటర్ లో స్పెషల్ షో!
రిలీజ్కు ముందే రికార్డులు తిరగరాస్తున్న సాహో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రపంచ ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్లో ప్రదర్శించనున్నారు. పారిస్లోని ఈ థియేటర్లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది.
ముస్లింలను తప్పుగా చూపిస్తున్నారు.. పాక్ నటి ఫైర్!
ఐరాస వేదికగానూ తాను హాలీవుడ్ లో ముస్లింలను చెడుగా చూపిస్తున్న తీరు ఇస్లాంఫోబియాకు దారి తీస్తోన్న వైనాన్ని ఎత్తిచూపుతూ సంచలన కామెంట్స్ చేశారు మెవిష్ హయత్. మరోవైపు అంతర్జాతీయ వేదికపై పాక్ నటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా అనే చర్చలు సాగుతున్నాయి.
సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
కొబ్బరి మట్ట చిత్రంతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సంపూర్ణేష్ బాబు సినిమాకి ఎంత తీసుకుంటారు? తొలి చిత్రానికి ఎంత? ఇప్పుడు ఎంత డిమాండ్ చేస్తున్నారు? తమిళ్లో కూడా ఎంట్రీ ఇస్తున్న సంపూర్ణేష్ బాబు ఆదాయం ఎంత?