ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు మేనిఫెస్టో పై దృష్టి సారించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తన మేనిఫెస్టో ను విడుదల చేసింది.
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరపాలని ఐక్యరాజ్య సమితి తనకు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. మన దేశంలో ఎన్నికలు చాలా స్వేచ్ఛగా జరుగుతాయని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. అదే సమయంలో ఈ రాష్ట్రంతో పాటు పంజాబ్, హరియాణాలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో రెండో పిటిషన్ దాఖలైంది. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. సీఎం పదవిలో ఉండాలా ? వద్దా అనేది కేజ్రీవాల్ వ్యక్తగత విషయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని మరో సారి కోర్టు తేల్చి చెప్పింది.
లోక్ సభ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నిన్న బాక్సర్ విజేందర్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరగా.. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కూడా ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
వాటర్ ట్యాంకులో పడి 30 కోతులు మృత్యువాత పడిన ఘటన నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాటిని మున్సిపల్ సిబ్బంది బుధవారం తొలగించారు. అయితే అవి కొన్ని రోజుల కిందట ట్యాంకులో పడి మరణించి ఉంటాయని, కానీ తాము ఆ నీటిని ఇంత కాలం తాగామని, ఇది తమ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. ఈడీ, ఐటీ తరువాత ఆర్టీఐని కూడా ఆయన కూటమిలో చేర్చుకున్నారని ఆరోపించారు. తాము మతానికి వ్యతిరేకం కాదని, మతతత్వానికి మాత్రమే శత్రువులం అని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి, ఆరు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం సాయంత్రం విడుదల అయ్యారు. ఆయనకు జైలు బయట ఆప్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
కాంగ్రెస్ నాయకుడు, ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ బీజేపీలో చేరారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న సమయంలో తీసిన ఫొటోలు ఆ సమయంలో వైరల్ అయ్యాయి.
సెబీ మరో ఎస్ బీఐగా మారకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సెబీ తన నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించడానికి గడువును కోరదని ఆశిస్తున్నానని తెలిపారు.