ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ ను సీఎం పదవిలో నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది.
మనుషుల స్వార్ధానికి దెబ్బతింటున్న పంచభూతాల నిరసనను ఈ. వెంకటేష్ రాసిన కవిత ' పంచభూతాలు ' లో చదవండి :
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు చీఫ్ గా కొనసాగుతున్న సదానంద్ వసంత్ డాటే ను ఎన్ఐఏకు డీజీగా నియమిస్తూ కేంద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడుకు చెందిన ఎండీఎంకే ఎంపీ ఎ.గణేశమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కొద్ది రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఆయన మరణించడం ఎండీఎంకే వర్గాల్లో విషాదం నింపింది.
ఎలక్టోరల్ బాండ్ ఇష్యూ అధికార భారతీయ జనతా పార్టీకి భారీగా నష్టం కలిగిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ అంచనా వేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమని ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని మరో నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒక్కరు మినహా.. మిగిలిన ముగ్గురు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.
స్వతంత్ర ఎంపీ, సినీ నటి నవనీత్ రాణాకు బీజేపీ టికెట్ కేటాయించింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఆమెను బరిలోకి దిపింది. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ అమరావతి విభాగం వ్యతిరేకించింది.
తన దగ్గర డబ్బులు లేవని అందుకే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అందుకే బీజేపీ అధిష్టానం చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని చెప్పారు.
జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపబోమని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అన్నారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని అన్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి పాలన సాగిస్తున్న నేపథ్యంలో సక్సేనా ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో జిల్లాలను కుదించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం కొన్ని జిల్లాలో తక్కువ జనాభా ఉందని, అందుకే తగ్గించాలని యోచిస్తోందని తెలుస్తోంది.