బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి ఎన్నికలకు వెళ్తోందని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఈసీని కోరింది.