తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ చర్యలు చూసి కొందరు వణికిపోతున్నారని తెలిపారు. గత పదేళ్లలో కేవలం అభివృద్ధి ట్రైలర్ మాత్రమే చూశారని, ఇప్పుడు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
200 సీట్ల కంటే ఎక్కువ గెలిచి చూపాలని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
కే.కేశవరావుకు బీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అలాంటి పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేసి వెళ్లడం దురదృష్టకరమని చెప్పారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింహం అని, ఆయనను ఎక్కువ కాలం జైలులో ఉంచలేరని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ప్రతిపక్ష ఇండియా కూటమి ‘లోక్ తంత్ర బచావో’ ర్యాలీని నిర్వహించాయి. అందులో ఆమె పాల్గొని ప్రసంగించారు.
ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్పీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే టెట్ ఫలితాలు కూడా మరింత ఆలస్యం కానున్నాయి. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించకూడదని, టెట్ ఫలితాలు విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ తో పాటు అన్ని రకాల మీడియాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు అయ్యింది. దీనికి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రాజ్ నాథ్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ కమిటీ పూర్తి స్థాయి మేనిఫెస్టో ను తయారు చేయనుంది.
బీజేపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసినా.. 48 గంటల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆరుగురు మంత్రులు బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని చెప్పారు.
ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఐటీ శాఖ నుంచి తమకు మరో రెండు నోటీసులు అందాయని వెల్లడించారు.