ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది.
ఏపీలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తన అభ్యర్థుల మూడో లిస్టు విడుదల చేసింది. ఇందులో 11 అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటన్ కు వెళ్లారు. అక్కడ ప్రధానికి ఘన స్వాగతం లభించింది. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో ను అందుకోనున్నారు.
ఇస్రో పుష్పక్ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ (ఆర్ఎల్వీ) ఎల్ఈఎక్స్ 02 ల్యాండింగ్ ప్రయోగాన్ని నేటి ఉదయం విజయవంతంగా నిర్వహించింది. 7.10 గంటలకు కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఈ ప్రయోగం జరిగింది.
రైలు ప్రయాణికులు సులువుగా టిక్కెట్ కొనుగోలు చేసేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులువుగా డబ్బులు చెల్లించేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నేడు దేశ వ్యాప్త నిరసనలు చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. దేశంలోని ఉన్న అన్ని బీజేపీ కార్యాలయాల ఎదుట ఆందోళన జరపాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలో సాధనాలుగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్నానని చెప్పారు.
తనకు కొడాలి నాని, వల్లభనేని వంశీతో ఎలాంటి సంబంధాలు లేవని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. టీడీపీ టిక్కెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నాని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆ పార్టీ జీపు నుంచి హెలికాప్టర్ల వరకు స్కామ్ లకు పాల్పడిందని ఆరోపించారు.
బీజేపీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ చేస్తున్న మోసానికి చంద్రబాబు నాయుడు, జగన్ లు ఇద్దరు మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని బీజేపీ అంబానీ, అదానీలకు దోచి పెట్టిందని అన్నారు.