ప్రధాని నరేంద్ర మోడీపై వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ అన్నారు. అలాగే మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై కూడా పోటీ చేయాలని ఉందని తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. తన అరెస్టు, ఈడీ కస్టడీని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణకు స్వీకరించలేదు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. భూ కబ్జా ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ ఒక రోజంతా సాహిత్య సభలను నిర్వహిస్తోంది. ఇది మూడు విభాగాలుగా ఉండనుంది.
ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు..
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కేంద్ర రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయని ఆమె ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మరో అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది.
ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలనే పదే పదే అడుగుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తన అరెస్టు ఒక కుట్ర అని ఆమె ఆరోపించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ సందేశం పంపించారు. తీహార్ జైలుకు స్వాగతం అని అందులో పేర్కొన్నారు. తాను అప్రూవల్ గా మారుతానని చెప్పారు.
మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కేటాయించింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయనను ఖరారు చేసింది.