హిందువులు తమ ధర్మాన్ని కాపాడుకోవాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ (Union Rural Development Minister Giriraj Singh) అన్నారు. హలాల్ మాంసాన్ని (halal meat) మాత్రమే ముస్లింలు తింటారని, అలాగే హిందువులు కూడా జట్కా మాంసాన్నే (jhatka meat) తినాలని సూచించారు.
బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ వైఫల్యం వల్ల తెలంగాణ ఏడు మండలాలను కోల్పోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan reddy)అన్నారు. విభజన హామీలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదని ఆరోపించారు.
కదులుతున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం (gang rape on moving bus)జరిగింది .కాన్పూర్ నుంచి జైపూర్ (kanpur - jaipur) వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన ఓ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) మంత్రి పదవి పొందేందుకే మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)పై విమర్శలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) ఆరోపించారు. మంత్రి పదవి కోసం ఇంతలా దిగజారిపోకూడదని అన్నారు.
హైదరాబాద్ లోని బండ్లగూడలో కెమికల్ బ్లాస్ట్ (chemical blast in hyderabad bandlaguda) సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్టుగా సమాచారం. కెమికల్ డబ్బా తెరవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident in Tamil nadu) తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు మరణించారు (3 Telangana Ayyappa devotees dead). ములుగు జిల్లా (mulugu district) కు చెందిన ఈ భక్తులు శబరిమలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
లావు తగ్గేందుకే టీడీపీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు (Minister Chelloboina Venu) అన్నారు. యువగళం పాదయాత్ర క్యాట్ వాక్ అని చెప్పారు. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో నారా లోకేష్ కే తెలియదని అన్నారు.
తమ ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోబోదని తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Telangana IT Minister Sridhar Babu) అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తామని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుతామని చెప్పారు.
మధ్యధరా సముద్రం (Mediterranean Sea)లో ఘోర పడవ ప్రమాదం (Boat capsizes)జరిగింది. ఈ ఘటనలో 60 మంది ప్రాణాలు (60 people died) కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో పడవలో 86 మంది ఉన్నారు.
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మగాళ్లకూ ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఓ యువకుడు నిరసన చేపట్టాడు. మహిళలకు (mahalaxmi) ఉచిత బస్సు సౌకర్యం (free bus service)కల్పించడం వల్ల పురుషులకు సీట్లు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.