లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ఎస్ఈ)లో చదువుతున్న ఓ భారతీయ విద్యార్థి అక్కడ జరిగిన స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేశారు. అయితే ఎన్నికలకు 24 గంటల ముందు తనపై దుష్స్రచారం, విద్వేష ప్రచారం జరిగిందని తెలిపారు. అయితే దీనికి తాను గతంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వడమే కారణమని చెప్పారు.