ఇక నుంచి తప్పుదోవ పట్టింటచే ప్రకటనలు చేయబోమని పతంజలి సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆయుర్వేదం ద్వారా జీవనశైలి సంబంధిత వ్యాధులను నయం చేయడమే కంపెనీ ఉద్దేశమని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఎదుట హాజరు అవుతానని, కానీ ఆ దర్యాప్తు సంస్థ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై కోర్టు నేడు విచారణ జరపనుంది.
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో 10 నిమిషాల వ్యవధిలో వరుస భూకంపాలు సంభించాయి. గురువారం ఉదయం 06.08 గంటలకు మొదటి, ఉదయం 06.09 గంటలకు రెండో సారి ప్రకంపనలు సంభవించాయి.
రోహింగ్యాలకు భారత్ లో నివసించే హక్కు కల్పించడం తీవ్రమైన భద్రతా సమస్యలతో కూడుకున్నదని కేంద్రం తెలిపింది. అక్రమంగా భారత్ లోకి వచ్చిన వారికి ఇక్కడ నివసించే, స్థిర నివాసం ఏర్పర్చుకునే హక్కు లేదని సుప్రీంకోర్టుతో స్పష్టం చేసింది.
బొగ్గు గని కూలిపోవడంతో 12 మంది మైనర్లు దుర్మరణం చెందిన ఘటన పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో జరిగింది. దీనిపై బలుచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమకొండ ఆర్డీవో పై సీఎస్ శాంతి కుమారికి ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోన్ కాల్ లీక్ వివాదంలో మంత్రి ఈ ఫిర్యాదు చేశారు.
రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తామని అన్నారు. పంట నష్టం అంచనాకు సర్వే చేపడుతామని స్పష్టం చేశారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కు ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా ఆయన బ్రెయిన్ లో రక్త స్రావంతో బాధపడుతున్నారు. కానీ మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ టెలిఫోన్ లో మాట్లాడారు. పలు విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఘర్షణను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు.
ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు..