ఇకపోతే లోక్ సభ అభ్యర్థుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం నమోదైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభుపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో మిథున్ రెడ్డి విజయం సాధించారు.
కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగుల వేస్తోంది. 25 పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆధిక్యంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో పలు సర్వే సంస్థలు పలు రకాలుగా సర్వే ఫలితాలను ప్రకటించాయి. కొన్ని సంస్థలు టీడీపీకి ఎక్కువగా సీట్లు వస్తాయని ప్రకటిస్తే... కొన్ని సంస్థలు వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి. అయితే ఆయా సంస్థల సర్వే ఫలితాలు ఏ మేరకు వాస్తవం అవుతాయో అనే విషయం ఈ నెల 23వ తేదీన తేలనుంది.
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి. ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాల్లో వైసీపీకే ఆధిక్యత కనిపించింది.
సీఈవో ఆదేశాలతో ఇంటలిజెన్స్ డీజీ చంద్రబాబుతో భేటీ కావడం మానేశారు. నేరుగా తనకు రిపోర్ట్ చేసే నిఘా విభాగం అదనపు డీజీని కూడా తనకు సీఈవో దూరం చేయడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎపిలో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని విజయవాడ నుంచి పులివెందులకు వెళ్తున్న ప్రచార రథం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లోకసభ సభ్యుడు, టీడీపి అభ్యర్థి గల్లా జయదేవ్ ఇల్లు, కార్యాలయాలపై తాము దాడులు చేసినట్టు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టత ఇచ్చింది.
బుధవారం సాయంత్రం ఐటి అధికారులు మోదుగుల నివాసంపై, కార్యాలయంపై ఐటి దాడులు ప్రారంభించారు. ఐటీ దాడులకు తాను ఏమాత్రం భయపడేది లేదని, దాడులతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని మోదుగుల అన్నారు.