BJP : తెలంగాణ బిజెపికి బిగ్ షాక్... జాతీయ స్థాయిలో ఉన్న రెండు పదవులూ పాయే..!
బిజెపి జాతీయ అద్యక్షుడు నితిన్ నబిన్ తన కొత్త టీం ను రెడీ చేసుకున్నారు. తాజాగా బిజెపి జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు... ఇందులో ఏపీకి అవకాశం దక్కగా తెలంగాణకు మొండిచేయి లభించింది.

బిజెపి జాతీయ కార్యవర్గం రెడీ
BJP : భారతీయ జనతా పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి... కొత్తగా అద్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తన టీంను సిద్దం చేసుకున్నారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రాదాన్యత లభించగా తెలంగాణకు చోటు లేకుండా పోయింది. మరి బిజెపి జాతీయ కార్యవర్గంలో ఎవరెవరికి చోటు దక్కిందో తెలుసుకుందాం.
ఆంధ్ర ప్రదేశ్ కు దక్కిన పదవులివే...
బిజెపి ఉపాధ్యక్షులుగా 13మంది సీనియర్లకు అవకాశం దక్కింది. వీరిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ కూతురు, రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఒకరు. ఇప్పటికే ఎంపీగా కొనసాగుతున్న ఆమెకు బిజెపి కీలక బాధ్యతలు అప్పగించింది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మరో నాయకుడు రామ్ మాధవ్ కు కూడా బిజెపి ఉపాధ్యక్ష పదవి దక్కింది. అయితే ఆయనను డిల్లీ కోటాలో ఈ బాధ్యతలు అప్పగించింది బిజెపి. అమలాపురంకు చెందిన ఆయన ప్రస్తుతం జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన బిజెపి ఉపాధ్యక్షుడిగా నియమించింది.
ఇక బిజెపి జాయింట్ కోఆర్డినేటర్ గా ఏపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం దక్కింది. ఇప్పటికే రాష్ట్ర బిజెపిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈయనకు ప్రమోషన్ కల్పిస్తూ కేంద్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ముగ్గురు నాయకులకు నితిన్ నబీన్ టీమ్ లో చోటు దక్కింది.
తెలంగాణ బిజెపికి మొండి చేయి
ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలోనే బిజెపి స్ట్రాంగ్ గా ఉంది... ఇక్కడ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలాంటి రాష్ట్రానికి కేంద్ర కార్యవర్గంలో చోటు దక్కలేదు... ఒక్కరంటే ఒక్క నాయకుడికి కూడా జాతీయ స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించలేదు అదిష్టానం. ఉన్న రెండు పదవులను కూడా తొలగించింది.
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలికి ఇంతకాలం డికె. అరుణ కొనసాగారు. అలాగే బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా డా. లక్ష్మణ్ కొనసాగారు. వీరిద్దరినీ ఆ పదవుల నుండి తొలగించింది బిజెపి... వీరి స్థానంలో కొత్తవారిని నియమించింది. వీరిని కొనసాగించకపోగా కొత్తవారికి అవకాశం కూడా ఇవ్వలేదు.
బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు వీళ్లే...
బిజెపి జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మందికి అవకాశం దక్కింది.
వసుంధర రాజే సింధియా - రాజస్థాన్
తీర్థ్ సింగ్ రావత్ - ఉత్తరాఖండ్
రామ్ మాధవ్ - డిల్లీ
వైజయంత్ జయ్ పాండా - ఒడిశా
డి. పురందేశ్వరి - ఆంధ్ర ప్రదేశ్
రేఖా శర్మ - ఉత్తర ప్రదేశ్
వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి - గుజరాత్
భారతి ప్రవీణ్ పవార్ - మహారాష్ట్ర
సర్దార్ మన్జీత్ సింగ్ బాదల్ - పంజాబ్
లాల్ సింగ్ ఆర్య - మధ్య ప్రదేశ్
ఎం. నాగరాజు - కర్ణాటక
తారీఖ్ మన్సూర్ - ఉత్తర ప్రదేశ్
మధుచంద్ కర్ - పశ్చిమ బెంగాల్

