Asianet News TeluguAsianet News Telugu

లారీని ఢీకొట్టిన వైఎస్ షర్మిల ప్రచార రథం: ఒకరి మృతి

షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని విజయవాడ నుంచి పులివెందులకు వెళ్తున్న ప్రచార రథం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. 

YS Sharmila vehicle collusion kills one person
Author
Nellore, First Published Apr 11, 2019, 6:51 AM IST

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల ఎన్నికల ప్రచార రథం ఓ లారీని ఢీకొంది. ఈ  ఘటనలో ఒకరు మరణించగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామం వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని విజయవాడ నుంచి పులివెందులకు వెళ్తున్న ప్రచార రథం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ నగిరి సంజీవనాయుడు (52) అక్కడికక్కడే మరణించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios