బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఐదుగురు అభ్యర్థులకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారంనాడు ఈ విషయం తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఐదుగురు అభ్యర్థుల్లో ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ కు చెందినవారు కాగా, బీజేపీ, ఆర్ఎస్పీ నుంచి చెరొకరు ఉన్నారు.