తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాను మహబూబాబాద్ నియోజకవర్గం నుండి రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది పనులు, ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్న నమ్మకంతో వున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులను చూసి కాకుండా ముఖ్యమంత్రిని చూసి మాత్రమే ఓటేశారని...అందువల్ల 16 సీట్లు తామే గెలుచుకోనున్నట్లు కవిత తెలిపారు.