తెలంగాణలో గురువారం లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే తాను పోటీచేస్తున్న చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలిస్తే పొద్దున్నుండి బిజీబిజీగా గడిపిన టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఎంపీ, ఎంఎల్ఏ కాలనీలోని సెంట్రల్ నర్సరీ పోలింగ్ బూత్ లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.