దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత దేశానికి మరోసారి మోదీ ప్రధాని కావాలని తారు కోరుకుంటున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో వున్న బిజెపికి మరింత జోష్ అందించగా...ఇతర ప్రతిపక్ష పార్టీలకు మాత్రం మింగుడుపడటం లేదు. దీంతో పాక్ ప్రధానిపై విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఓవైసి ఫైర్ అయ్యారు.