Zodiac signs:కృష్ణుడికి ఇష్టమైన రాశులు...కృష్ణాష్టమి తర్వాత అదృష్ట యోగం పట్టే రాశులు ఇవే
Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశిపై ఏదో ఒక దేవుని అనుగ్రహం ఉంటుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ కృష్ణునికి ఇష్టమైన రాశులు, ఈ కృష్ణాష్టమి తర్వాత అదృష్టం పెరిగే రాశులు ఏంటో చూద్దాం..

వృషభ రాశి..
వృషభ రాశికి శుక్రుడు అధిపతి. ఈ రాశివారిపై కృష్ణుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా.. వాటిని ఆ కృష్ణయ్య వీరికి అండగా ఉండి తీర్చేస్తాడు. ఆయన దయతో వీరికి ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. ఈ జన్మాష్టమి రోజున ఈ రాశివారు ఆ కన్నయ్యకు పెరుగు, పంచదార, తెల్లటి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి దానధర్మాలు చేస్తే.. వీరికి మంచి జరుగుతుంది.
2. సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యభగవానుడు (విష్ణు స్వరూపం). కృష్ణుని కృప వల్ల ఈ రాశి వారికి గొప్ప యోగం పట్టబోతోంది. ఉద్యోగం, వ్యాపారాలలో విశేషమైన ధన లాభాలు ఉంటాయి. ఆస్తిపాస్తులు పెరిగి, ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆలోచనా శక్తి, తెలివితేటలు పెరుగుతాయి. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణునికి పసుపు రంగు వస్త్రాలను సమర్పిస్తే మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.
తులా రాశి
సంతోషానికి, శ్రేయస్సుకు ప్రతీక అయిన శుక్రుడు తులారాశికి అధిపతి. కృష్ణునిపై ఉన్న ప్రగాఢ భక్తి ఈ రాశి వారికి ఆయుధంగా మారుతుంది. దీర్ఘకాలిక సమస్యలు, బాధలు తొలగిపోతాయి. సంపద, ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు.కృష్ణాష్టమి పండుగ రోజున శ్రీకృష్ణునికి 'పంచామృతం'తో అభిషేకం చేయడం లేదా నైవేద్యంగా పెట్టడం అత్యంత శ్రేయస్కరం
ధనుస్సు రాశి
దేవగురు బృహస్పతి అధిపతిగా ఉన్న ధనుస్సు రాశి వారిపై కృష్ణుని దృష్టి ఎప్పుడూ ఉంటుంది. జ్ఞాన వృద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి పూజలు, జాగరణ చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం లభిస్తుంది.
మీన రాశి
మీన రాశికి కూడా అధిపతి గురుడే. శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఈ రాశి వారు ఆధ్యాత్మిక చింతనలో ముందుంటారు. విద్యార్థులకు చదువులో గొప్ప విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా సుఖసంతోషాలు నెరవేరుతాయి. కృష్ణుడి పూజలో పాల్గొని, పేదలకు లేదా పూజారులకు పసుపు రంగు పదార్థాలను దానం చేయడం మంచిది.

