- Home
- National
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ మొదటి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్.. ఆయన అందుకునే జీతం ఎంతో తెలుసా?
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ మొదటి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్.. ఆయన అందుకునే జీతం ఎంతో తెలుసా?
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం మొదటి సీఈఓగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. ఆయన జీతం, నివాసం, వాహనం, భద్రత సదుపాయాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆయోధ్య రామ మందిరం మొదటి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
అయోధ్యలోని రామమందిర పరిపాలన, నిర్వహణ బాధ్యతలను ఇకపై భారత వైమానిక దళ మాజీ అధికారి పర్యవేక్షించనున్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామ్ మందిర్ మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించింది. ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో అందరి అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జితేంద్ర మిశ్రాను 3 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులో నియమించారు.
ఆలయ రోజువారీ నిర్వహణ బాధ్యతలు
రామ మందిరం సీఈఓగా జితేంద్ర మిశ్రా ఆలయ పరిపాలన, రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షిస్తారు. మందిరానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వసతుల ఏర్పాటు ఆయన చూసుకుంటారు. అలాగే వివిధ విభాగాల బృందాల మధ్య సమన్వయం సాధించడం, ఆలయ ఆపరేషన్లకు సంబంధించిన పనులను నిర్వహించడం ఆయన బాధ్యతల్లో భాగం. భారత వైమానిక దళంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఈ కొత్త బాధ్యతలను సజావుగా నిర్వర్తించడానికి ఆయనకు ఎంతో ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
జితేంద్ర మిశ్రా జీతం ఎంత?
రామ్ మందిర్ సీఈఓ పదవికి లభించే ఖచ్చితమైన జీతం వివరాలను ట్రస్ట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సమయంలోనే, ఎంపికైన అధికారి వేతనం, ఇతర భత్యాలు పరస్పర ఒప్పందం ప్రకారం నిర్ణయిస్తామని ట్రస్ట్ తెలిపింది. అందువల్ల జితేంద్ర మిశ్రా నెలవారీ జీతం ఎంత అనే విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
అధికారిక నివాసం, వాహనం, వీఐపీ భద్రత
సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జితేంద్ర మిశ్రాకు అయోధ్యలో నివసించడానికి అధికారిక నివాస సౌకర్యం లభిస్తుంది. అయోధ్యలోనే ఉంటూ ఆలయ రోజువారీ పనులు, పరిపాలనపై దృష్టి పెట్టడానికి ఈ వసతి సహాయపడుతుంది. అయితే ఆయనకు ఎలాంటి నివాసం కేటాయిస్తారు, దాని వివరాలు ఏంటి అనే విషయాలు ట్రస్ట్ ఇంకా బయటపెట్టలేదు.
దీనితో పాటు జితేంద్ర మిశ్రాకు ప్రభుత్వ వాహనం, భద్రతా సిబ్బంది సదుపాయం కూడా ఉంటాయి. ప్రభుత్వ ఉన్నతాధికారికి లభించే విధంగానే ఆయనకు కొన్ని ప్రత్యేక వీఐపీ సౌకర్యాలు లభిస్తాయి. ఈ సౌకర్యాలకయ్యే ఖర్చునంతా రామ్ మందిర్ ట్రస్ట్ నిధుల నుంచే భరిస్తారు. ఈ సదుపాయాల పూర్తి వివరాల జాబితా త్వరలోనే వెల్లడి కానుంది.
వైమానిక దళంలో 40 ఏళ్ల సుదీర్ఘ సేవలు
జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళంలో దాదాపు 40 సంవత్సరాల పాటు విశేష సేవలందించారు. ఆయన 1986 డిసెంబర్ 6న ఫైటర్ పైలట్గా ఎయిర్ ఫోర్స్లో చేరారు. తన సుదీర్ఘ కెరీర్లో ఆయన 18 కంటే ఎక్కువ రకాల విమానాలను నడిపారు. మొత్తం 3,000 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఆయనకు ఉంది. వైమానిక దళంలో ఉన్నప్పుడు ఆయన అనేక కీలకమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.
దేవ్రియా జిల్లాకు చెందిన జితేంద్ర మిశ్రా
జితేంద్ర మిశ్రా స్వస్థలం ఉత్తర ప్రదేశ్లోని దేవ్రియా జిల్లా, భాట్పాల్ రాణి ప్రాంతంలోని భోపాల్పురా గ్రామం. వైమానిక దళంలో అనేక ఉన్నత పదవుల్లో పనిచేసిన ఆయన, ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్ సీఈఓగా ఒక భారీ పరిపాలనా బాధ్యతను చేపట్టారు. ఆయనకున్న నాయకత్వ లక్షణాలు, ఆర్గనైజేషన్ స్కిల్స్ మందిర నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

