శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య
: దేవుడు వచ్చి కూడ శిఖా చౌదరి అమాయకురాలు అని చెప్పినా కూడ తాను నమ్మలేనని జయరామ్ భార్య పద్మశ్రీ చెప్పారు. నా భర్త మంచోడని ఆమె చెప్పారు.తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ప్రచారం సరికాదన్నారు.శిఖా చౌదరికి ఏపీ పోలీసులు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని పద్మశ్రీ ప్రశ్నించారు.
హైదరాబాద్: దేవుడు వచ్చి కూడ శిఖా చౌదరి అమాయకురాలు అని చెప్పినా కూడ తాను నమ్మలేనని జయరామ్ భార్య పద్మశ్రీ చెప్పారు. నా భర్త మంచోడని ఆమె చెప్పారు.తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ప్రచారం సరికాదన్నారు.శిఖా చౌదరికి ఏపీ పోలీసులు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని పద్మశ్రీ ప్రశ్నించారు.
జయరామ్ భార్య పద్మశ్రీ ఓ తెలుగు న్యూస్ ఛానెల్కు గురువారం నాడు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆమె వెల్లడించారు.
శిఖా చౌదరి వల్ల తమ కుటుంబానికి హాని కలుగుతోందని తనకు ఆమెను చూసినప్పుడే అన్పించిందన్నారు. 2014లోనే శిఖా చౌదరి తమ కుటుంబంలోకి వచ్చిందన్నారు.
పేద కుటుంబం నుండి వచ్చిన శిఖా చౌదరి బీఎండబ్ల్యూ కారును నడిపే స్థాయికి ఎలా ఎదిగిందనే విషయమై విశ్లేషించాలన్నారు.
కొన్ని కంపెనీల్లో అనవసరంగా శిఖా చౌదరి డైరెక్టర్లుగా నియమించారని చెప్పారు. నందిగామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని నారాయణ కేపిటల్ పేరుతో భూమిని కొనుగోలు చేసినట్టు ఆయన చెప్పారు.
ఎక్స్ప్రెస్ టీవీ వైఎస్ ఛైర్మెన్గా శిఖా చౌదరిని నియమించినట్టు చెప్పారు. ఆమె తన విలాసవంతమైన జీవితం కోసం మా డబ్బును వాడుకొందన్నారు.
1998లో తాను అమెరికాకు వెళ్లినట్టు చెప్పారు. మా మధ్య విబేధాలు ఉంటే 30 ఏళ్లుగా మేం ఎలా కలిసి ఉంటామని పద్మశ్రీ ప్రశ్నించారు.
2014లో శిఖా చౌదరి తమ జీవితంలో ప్రవేశించినట్టుగా గుర్తించినట్టు పద్మశ్రీ చెప్పారు. ఆమెను దూరం పెట్టాలని తన భర్తతో గొడవపడినట్టు ఆమె ఒప్పుకొన్నారు. ఆమెను కంపెనీ వ్యవహరాల్లో దూరం పెట్టాలని తాను గొడవ పడినట్టు ఆయన తెలిపారు.
ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకొందని ఫేస్ బుక్లో శిఖా చౌదరి పోస్ట్ పెడితే ఈ పోస్టుకు నీవు అర్హురాలివా అంటూ తాను కామెంట్ పెట్టానని ఆమె చెప్పారు.
ఇండియాలోని సంస్థలకు తనకు చెక్ పవర్ లేదు. ఈ ఏడాది జనవరి 1 తేదీన జయరామ్ అమెరికా నుండి ఇండియాకు వచ్చారని ఆమె చెప్పారు.
ప్రతి రోజూ జయరామ్ ఫోన్లో మాట్లాడేవవారని ఆమె గుర్తు చేశారు.బిజినెస్ విషయంలో ప్రాణహని ఉందనే అనుమానంతో గన్మెన్ను కూడ పెట్టుకొన్నారని చెప్పారు.
గతమంతా మర్చిపోయి ఉందామని జయరామ్ చెప్పారన్నారు.ప్రతి రోజు పది నుండి 15 దఫాలు ఫోన్ చేసే జయరామ్ హత్య చోటు చేసుకొన్న రోజున తాను ఎన్ని దఫాలు ఫోన్ చేసిన జయరామ్ ఫోన్ తీయలేదన్నారు.
జయరామ్ హత్యకు శిఖా చౌదరి ప్లాన్ చేసిందనే తాను అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్లాన్ చేసిందేవరనే విషయాన్ని ఏపీ పోలీసులు సరిగా చేయలేదన్నారు.
ఏపీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసిన తర్వాతే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
జయరామ్ చనిపోతే శిఖా చౌదరి నందిగామ వెళ్లకుండా మా ఇంటికి వచ్చి ఎందుకు వెతికిందని ఆమె ప్రశ్నించారు. జయరామ్ అంత్యక్రియలకు శిఖా కుటుంబం ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు.
శిఖా చౌదరికి ఏపీ పోలీసులు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని పద్మశ్రీ ప్రశ్నించారు. జయరామ్కు రాకేష్ రెడ్డి నాలుగున్నర కోట్ల అప్పు ఉన్నాడనే విషయం తాను నమ్మడం లేదన్నారు.
సంబంధిత వార్తలు
ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ
పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు
జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ
జయరామ్ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్
జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే
19 గంటలు నిర్భంధం: జయరామ్కు రాకేష్ చిత్రహింసలు
శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య
శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య
జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు
జయరామ్ హత్య కేసులో ట్విస్ట్లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్
జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు
శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ
హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు
చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...
జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్
జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?
గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి
జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి
రాకేష్ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి
జయరామ్ మర్డర్ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?
జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం
వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం
జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు
జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...
శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్
జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి
చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్
హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?
చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?