Asianet News TeluguAsianet News Telugu

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి

తాను ఇద్దరితో విడాకులు తీసుకున్నానని శిఖా చౌదరి చెప్పింది. రాకేష్ రెడ్డితో డేటింగ్ చేశానని, జయరాం వల్ల తాను రాకేష్ రెడ్డికి దూరం కావాల్సి వచ్చిందని చెప్పింది. ప్రస్తుతం శ్రీకాంత్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపింది.

Sikha Choudhary says she agreed for relation with Jayaram
Author
Hyderabad, First Published Feb 3, 2019, 7:12 PM IST

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాంత తనకు వివాహేతర సంబంధం ఉన్నమాట వాస్తవమేనని ఆయన మేనకోడలు శిఖా చౌదరి చెప్పింది. తనకు నచ్చింది కాబట్టే జయరాంతో శారీరక సంబంధానికి అంగీకరించానని ఆమె చెప్పింది. అది నా వ్యక్తిగత జీవితమని, తన ఇష్టమని అన్నది. తాను ఎందరితో తిరిగినా ప్రపంచానికి వచ్చే నష్టమేమీ లేదని అన్నది.

ఆ మేరకు టీవీ చానెల్స్ లో వార్తలు వస్తున్నాయి. జయరాం మంచోడు కాడు, సెక్స్ పిచ్చోడని ఆమె అన్నది.  రాకేష్‌రెడ్డితో తనకు ఓ విల్లా విషయంలో గొడవ ఉందని ఆమె తెలిపింది. అయితే జయరామ్‌ను రాకేష్‌రెడ్డి చంపుతాడని అనుకోలేదన్నారు. చెక్ పవర్ మొత్తం మామ జయరామ్ భార్య పద్మజ పేరుతో ఉందని పోలీసుల విచారణలో శిఖాచౌదరి వెల్లడించింది. దానివల్లనే ఎక్స్ ప్రెస్ టీవీ మూత పడిందని చెప్పింది.

తాను ఇద్దరితో విడాకులు తీసుకున్నానని శిఖా చౌదరి చెప్పింది. రాకేష్ రెడ్డితో డేటింగ్ చేశానని, జయరాం వల్ల తాను రాకేష్ రెడ్డికి దూరం కావాల్సి వచ్చిందని చెప్పింది. ప్రస్తుతం శ్రీకాంత్ తో డేటింగ్ చేస్తున్నట్లు తెలిపింది. మామయ్య చనిపోయిన రోజు తాను శ్రీకాంత్ తో కలిసి వికారాబాద్ కు లాంగ్ డ్రైవింగ్ కు వెళ్లానని చెప్పింది.

మర్నాడు ఉదయం ఆరు గంటలకు అమ్మ ఫోన్ చేసి మామయ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెప్పిందని, దాంతో తాను మామయ్య ఇంటికి వెళ్లి తనకు రాసిన భూమి పత్రాల కోసం వెతికానని చెప్పింది. ఆ తర్వాత తాను మామయ్యను చూడడానికి విజయవాడ వెళ్లానని చెప్పింది. ఇంతలో పోలీసులు ఫోన్ చేయడంతో తాను పోలీసు స్టేషన్ కు వెళ్లానని చెప్పింది.
 
జయరామ్‌ హత్య కేసులో పోలీసులు కీలక చిక్కుముడులు వీడుతున్న విషయం తెలిసిందే. హత్యకు సూత్రధారి, పాత్రధారి ఆయన మేనకోడలు శిఖా చౌదరి అని నిర్ధారణకు పోలీసులు వచ్చారు. కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శిఖాతోపాటు ఆమె సోదరి మనీషా, శిఖా బాయ్‌ఫ్రెండ్‌ రాకేశ్‌ చౌదరి స్నేహితుడు శ్రీకాంత్‌ రెడ్డిని కూడా విచారిస్తున్నారని తెలుస్తోంది.

మామయ్య చాలా మంది వద్ద అప్పులు చేశాడని, రాకేష్ రెడ్డి జయరాంకు 4.5 కోట్ల రూపాయల అప్పు ఇచ్చాడని, దాన్ని చెల్లించకపోవడంతో గొడవలు ప్రారంభమయ్యాయని శిఖా చౌదరి చెప్పింది.

సంబంధిత వార్తలు

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు

Follow Us:
Download App:
  • android
  • ios