MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • PM Modi: NEET పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ

PM Modi: NEET పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ

PM Modi: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా గురువారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎక్స్ లో కీల‌క పోస్ట్ చేశారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 23 2026, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు..
Image Credit : Asianet News

పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు..

పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై వేగంగా విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా వెల్లడించారు. దేశ యువత భవిష్యత్తు, వారి సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న ప్రధాని, విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. అవసరమైన అన్ని చర్యలను వేగంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడితే కఠిన చర్యలే
Image Credit : Getty

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడితే కఠిన చర్యలే

పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. వేగవంతమైన విచారణతో పాటు దోషులకు త్వరితగతిన శిక్షలు అమలయ్యేలా కొత్త వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత పెంచేందుకు ఇప్పటికే పలు సంస్కరణలు చేపడుతున్నామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కూడా అదే క్రమంలో తీసుకున్న కీలక నిర్ణయమని వివరించారు.

Nothing is more important than the welfare and future of our youth!

We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…

— Narendra Modi (@narendramodi) July 23, 2026

Related Articles

Related image1
హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌పైగా జీతం, ఎవ‌రు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
Related image2
అడుగు బ‌య‌ట‌పెట్టేముందు ఆలోచించుకోండి.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు. ఎల్లో అల‌ర్ట్ జారీ
34
జంతర్‌మంతర్ నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు.. మూడు ప్రధాన డిమాండ్లు
Image Credit : X

జంతర్‌మంతర్ నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు.. మూడు ప్రధాన డిమాండ్లు

ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన విద్యార్థుల ఆందోళనలు క్రమంగా దేశంలోని పలు నగరాలకు విస్తరించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి, యువజన సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. నిరసనకారులు ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లు ఇవే.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. పేపర్ లీక్ ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించాలి. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ డిమాండ్లు నెరవేరే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థి సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

44
ఢిల్లీలో ఉద్రిక్తత.. పోలీసు-నిరసనకారుల మధ్య ఘర్షణ
Image Credit : ANI

ఢిల్లీలో ఉద్రిక్తత.. పోలీసు-నిరసనకారుల మధ్య ఘర్షణ

ఢిల్లీలో నిర్వహించిన 'చలో సంసద్' కార్యక్రమం సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విష‌యం తెలిసిందే. నిరసనకారులు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. ఢిల్లీ పోలీసుల వివరాల ప్రకారం, ప్రత్యేక కమిషనర్, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులతో పాటు మహిళా పోలీసు సిబ్బంది సహా 118 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. మరోవైపు దాదాపు 60 మంది నిరసనకారులు, విద్యార్థులు కూడా గాయపడినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ పేపర్ లీకేజీ వంటి తీవ్రమైన అంశాన్ని రాజకీయ వివాదంగా కాకుండా, విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పరీక్షలపై విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
నరేంద్ర మోదీ
భారత దేశం
Latest Videos
Recommended Stories
Recommended image1
Jantar Mantar: ముంబై, హైద‌రాబాద్ నుంచి జంత‌ర్‌మంత‌ర్‌కి.. భారీగా జొమాటో, స్విగ్గీ ఆర్డ‌ర్లు
Recommended image2
Fact Check: ఢిల్లీ నిరసనల్లో ప్రాణ నష్టంపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image3
PM Modi: మోదీ మార్క్.. దేశ రాజ‌కీయాల్లో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం
Related Stories
Recommended image1
హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌పైగా జీతం, ఎవ‌రు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
Recommended image2
అడుగు బ‌య‌ట‌పెట్టేముందు ఆలోచించుకోండి.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు. ఎల్లో అల‌ర్ట్ జారీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved