MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • International
  • Nepal Floods: ముప్పు ఇంకా ముగిసిపోలేదు.. నేపాల్‌కు చైనా హెచ్చ‌రిక‌, మ‌రో 3 రోజుల్లో

Nepal Floods: ముప్పు ఇంకా ముగిసిపోలేదు.. నేపాల్‌కు చైనా హెచ్చ‌రిక‌, మ‌రో 3 రోజుల్లో

Nepal Floods: ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన నేపాల్‌ను మరో ప్రమాదం భయపెడుతోంది. ఇప్పటికే ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చిన వేళ.. రసువా జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఓ సరస్సు ఆందోళనకు కార‌ణ‌మ‌వుతోంది.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 27 2026, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రసువాలో కొత్త సరస్సు.. పెరుగుతున్న నీటి మట్టం
Image Credit : Asianet News

రసువాలో కొత్త సరస్సు.. పెరుగుతున్న నీటి మట్టం

నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటే కోషి నదీ ప్రవాహానికి సమీపంలో ఈ కొత్త సరస్సు ఏర్పడినట్లు సమాచారం. టిబెట్ ప్రాంతంలో పుట్టే చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు ముందుకు సాగుతూ పరస్పరం కలుస్తాయి. అనంతరం వాటి ప్రవాహం నేపాల్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ నదులు కలిసే ప్రాంతానికి సమీపంలోనే భారీగా నీరు నిలిచి సరస్సు రూపుదిద్దుకున్నట్లు చైనా అధికారులు గుర్తించారు. గురువారం నాటికి సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరినట్లు అంచనా వేశారు. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు నీరు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో నీటి ఒత్తిడి పెరిగి సరస్సు తెగిపోయే పరిస్థితి ఏర్పడొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సరస్సు తెగితే మళ్లీ వరద ముప్పు
Image Credit : ANI

సరస్సు తెగితే మళ్లీ వరద ముప్పు

కొత్తగా ఏర్పడిన సరస్సుకు గండి పడితే భారీ మొత్తంలో నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భోటేకోషి, త్రిశూలి నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి. ఇప్పటికే వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలకు ఇది మరో పెద్ద సవాలుగా మారనుంది.

పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చైనా అధికారులు సరస్సును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ గండి పడితే నీటి ప్రవాహం ఏ ప్రాంతాలపై ప్రభావం చూపవచ్చు, ఎలాంటి అత్యవసర చర్యలు చేపట్టాలి అనే అంశాలపై అధికారులు సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
నెమ్మ‌దిగా వెళ్తేనే త్వ‌ర‌గా గ‌మ్యాన్ని చేరుకుంటాం.. మీ ఆలోచ‌న‌ను మార్చేసే క‌థ
Related image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
34
నేపాల్‌కు అధికారిక సమాచారం ఇచ్చిన చైనా
Image Credit : ANI

నేపాల్‌కు అధికారిక సమాచారం ఇచ్చిన చైనా

కొత్త సరస్సు, దాని వల్ల తలెత్తే ప్రమాదంపై చైనా ప్రభుత్వం నేపాల్‌కు అధికారికంగా సమాచారం అందించినట్లు నేపాల్ జల విజ్ఞాన, వాతావరణ విభాగం తెలిపింది. ఈ సమాచారాన్ని నేపాల్ విదేశాంగ శాఖకు కూడా చైనా అధికారులు తెలియజేసినట్లు పేర్కొంది. భోటేకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో మరోసారి వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్లకుండా దూరంగా ఉండాలని హెచ్చరించారు. తదుపరి అధికారిక సమాచారం వచ్చే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు.

44
రెస్క్యూ బృందాలకు ప్రత్యేక హెచ్చరిక
Image Credit : ANI

రెస్క్యూ బృందాలకు ప్రత్యేక హెచ్చరిక

ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉండటంతో సెర్చ్, రెస్క్యూ బృందాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణికులు, భద్రతా సిబ్బంది కూడా నదుల పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలతో నేపాల్‌లో పరిస్థితి విషమంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తుల్లో 359 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్వాన్ జిల్లాలోనే 132 మృతదేహాలను గుర్తించినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. ఇంకా పలువురి ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌కు కొత్త సరస్సు రూపంలో మరో ముప్పు ఎదురవడంతో ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. రాబోయే కొన్ని రోజులు కీలకంగా మారనున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image2
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image3
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Related Stories
Recommended image1
నెమ్మ‌దిగా వెళ్తేనే త్వ‌ర‌గా గ‌మ్యాన్ని చేరుకుంటాం.. మీ ఆలోచ‌న‌ను మార్చేసే క‌థ
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved