MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • International
  • Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు

Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు

Nepal Flash Floods: నేపాల్‌లో సంభవించిన ఘోర వరదల్లో మరణాల సంఖ్య 903కు చేరింది. 4,200 మందికి పైగా గల్లంతవ్వగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా వరద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 31 2026, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హిమపాతంతో మొదలైన ఊహించని ప్రళయం
Image Credit : ANI

హిమపాతంతో మొదలైన ఊహించని ప్రళయం

నేపాల్-టిబెట్ సరిహద్దు వద్ద ఎత్తైన ప్రాంతంలో హిమపాతం, మంచు కొండచరియలు విరిగిపడటంతో భోటే కోశి నది ఉగ్రరూపం దాల్చింది. సరిహద్దు దాటి విరుచుకుపడిన ఈ మెరుపు వరదలు, బురద నేపాల్‌లోని పలు జిల్లాలను పూర్తిగా ముంచెత్తాయి. వరదల ధాటికి అనేక గ్రామాలు, రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం మరణించిన వారి సంఖ్య 903కి చేరినట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ (NDRRMA) ప్రకటించింది. దట్టమైన బురద, రాయి కలిసి ముంచెత్తడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
4,200 మందికి పైగా గల్లంతు, భారీగా దెబ్బతిన్న జిల్లాలు
Image Credit : ANI

4,200 మందికి పైగా గల్లంతు, భారీగా దెబ్బతిన్న జిల్లాలు

ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 4,247 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. అందులో 3,655 మంది నేపాల్ పౌరులు ఉండగా, 592 మంది విదేశీయులు ఉన్నారు. అలాగే 85 మందికి పైగా భద్రతా సిబ్బంది కూడా వరదల్లో గల్లంతయ్యారు.

వివిధ జిల్లాల్లో నమోదైన మరణాల వివరాలు:

• చిత్వాన్: 272

• నవల్ పరాసి (ఈస్ట్): 207

• నవల్ పరాసి (వెస్ట్): 151

• నువాకోట్: 95

• గోర్ఖా: 62

• ధాడింగ్: 55

• తనహున్: 37

• రసువా: 24

ఇప్పటివరకు దాదాపు 10,451 మందిని రెస్క్యూ టీమ్‌లు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

Related Articles

Related image1
IRCTC గోదావరి టెంపుల్ టూర్: అంతర్వేది, అన్నవరం, ద్రాక్షారామ క్షేత్రాల దర్శనం.. బడ్జెట్‌లో ఇవి ఫ్రీ
Related image2
No Bag Day: స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. నెలకు ఒకరోజు నో బ్యాగ్ డే.. అసలు ఏంటిది?
35
తెలుగు యాత్రికులు క్షేమం.. ఇంకా 14 మంది ఆచూకీ లభ్యం కాలేదు
Image Credit : ANI

తెలుగు యాత్రికులు క్షేమం.. ఇంకా 14 మంది ఆచూకీ లభ్యం కాలేదు

ఈ ఘోర వరదల్లో పలువురు భారతీయ యాత్రికులు కూడా చిక్కుకున్నారు. అయితే, టిబెట్ నుంచి కాట్మండు చేరుకోవడానికి ప్రయత్నించిన 20 మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా కాట్మండు చేరుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో 14 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా దొరకలేదని, వారి కోసం రెస్క్యూ టీమ్‌లు ముమ్మరంగా గాలిస్తున్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

45
హైడ్రో పవర్ టన్నెల్‌లో చిక్కుకున్న వందలాది కార్మికులు
Image Credit : ANI

హైడ్రో పవర్ టన్నెల్‌లో చిక్కుకున్న వందలాది కార్మికులు

వరదల వల్ల సుమారు 933 మంది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కార్మికులు టన్నెళ్లలో చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా రసువా జిల్లాలోని త్రిశూలి-3A, చిలిమ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల టన్నెళ్లలో కార్మికులు చిక్కుకున్నారు. భారత స్పెషల్ టన్నెల్ రెస్క్యూ టీమ్‌లు, విదేశీ నిపుణులు, నేపాల్ సైన్యం వీరిని రక్షించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టన్నెల్‌లోకి ఎయిర్ పైపులు పంపి, డ్రిల్లింగ్ యంత్రాల సహాయంతో ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు.

55
భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్
Image Credit : ANI

భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్

నేపాల్ విపత్తు తీవ్రత దృష్ట్యా దాదాపు 20,000 మంది భద్రతా సిబ్బంది, 14 మిలిటరీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. బాధితులకు తక్షణ వైద్యాన్ని అందించడానికి 6 స్పెషల్ సర్జికల్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. వరదల వల్ల 40 కి పైగా సస్పెన్షన్ బ్రిడ్జిలు, 25 మైళ్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు, సోషల్ మీడియాలో ఏఐ క్రియేట్ చేసిన నకిలీ వీడియోలు, భయాందోళనలు రేకెత్తించే ప్రచారాలను అడ్డుకునేందుకు నేపాల్ ప్రెస్ కౌన్సిల్ కఠిన చర్యలు చేపట్టింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Recommended image2
Nepal Floods: నేపాల్ వరదల్లో 3000 మంది మిస్సింగ్.. గండక్ నది ఒడ్డున మృతదేహాల కలకలం
Recommended image3
ప్రపంచ ప్రఖ్యాత సరస్సు పేరు మార్చిన ట్రంప్... ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
IRCTC గోదావరి టెంపుల్ టూర్: అంతర్వేది, అన్నవరం, ద్రాక్షారామ క్షేత్రాల దర్శనం.. బడ్జెట్‌లో ఇవి ఫ్రీ
Recommended image2
No Bag Day: స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. నెలకు ఒకరోజు నో బ్యాగ్ డే.. అసలు ఏంటిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved