MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • kashmir tourism పహల్గాం దాడి: కశ్మీర్ పర్యాటకం ఢమాల్.. లక్షలమంది జీవనం అస్తవ్యస్తం?

kashmir tourism పహల్గాం దాడి: కశ్మీర్ పర్యాటకం ఢమాల్.. లక్షలమంది జీవనం అస్తవ్యస్తం?

పర్యాటక రంగం కుదేలు: కల్లోల కశ్మీర్లో 2021 నుంచి ప్రశాంతమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వ చొరవ, పర్యాటకంపై విపరీతంగా ఖర్చు చేయడంతో కశ్మీర్ తన భూతల స్వర్గం అనే పేరుని క్రమంగా అందిపుచ్చుకుంటోంది. కానీ తాజాగా పహల్గాంలో ఉగ్రవాదులు తీవ్ర ఘాతుకానికి పాల్పడి 27మందిని పొట్టన పెట్టుకున్నారు. ఎంతోమంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆ రాష్ట్ర భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది.  2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడి తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్రదాడి.

2 Min read
Author : Anuradha B
Published : Apr 24 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పర్యాటకానికి గట్టి దెబ్బ

పర్యాటకానికి గట్టి దెబ్బ

పహల్గాం లోయలో జరిగిన ఉగ్రదాడి లోయలో పరిస్థితులు చాలావరకు సాధారణ స్థితికి చేరుకున్న సమయంలో జరిగింది. కశ్మీర్‌లో పర్యాటకం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. కశ్మీర్ లోయలో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి అన్ని హోటళ్ళు, లాడ్జీలు, పర్యాటక ప్రదేశాలు కళకళలాడుతున్నాయి. అయితే, ఈ ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ లోయల్లో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించే పరిస్థితేలు కనిపించనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రికార్డు సంఖ్యలో పర్యాటకులు

రికార్డు సంఖ్యలో పర్యాటకులు

జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ ప్రకారం, 2021లో 1.13 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. 2022లో ఈ సంఖ్య 1.88 కోట్లకు పెరిగింది. 2023లో 2.11 కోట్లకు చేరుకుంది. 2024లో జమ్మూ కాశ్మీర్‌కు రికార్డు స్థాయిలో 2.36 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు, వీరిలో 27 లక్షల మంది కేవలం కశ్మీర్‌ను సందర్శించడానికి వచ్చారు.

35
లక్షలాది కుటుంబాలు రోడ్డుపాలు

లక్షలాది కుటుంబాలు రోడ్డుపాలు

కశ్మీర్ లోయలో లక్షలాది కుటుంబాలు పర్యాటకం నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉన్నాయి. వారు షికారా నడిపేవారు, హోటళ్ళు, రెస్టారెంట్లు, గుర్రాల వ్యాపారులు, హస్తకళల వస్తువులు అమ్మేవారు కావచ్చు. కానీ ఇప్పుడు పర్యాటకుల సంఖ్య తగ్గడం వల్ల వారి వ్యాపారాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. పహల్గాం ఉగ్రదాడి కశ్మీరీలకు తీవ్ర నష్టం కలిగించనుంది.

45
ప్రభుత్వ లక్ష్యానికి గండి

ప్రభుత్వ లక్ష్యానికి గండి

2025 నాటికి జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కశ్మీర్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, కుంకుమపువ్వు పర్యాటకం, వారసత్వ, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. కానీ కశ్మీర్‌లో జరిగిన ఈ ఉగ్రదాడి తర్వాత వీటన్నింటిపైనా ప్రభావం పడుతుంది.

55
రైతులపై ప్రభావం

రైతులపై ప్రభావం

లోయలో పర్యాటకం తగ్గడంతో పాటు పండ్ల వ్యాపారంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల కుప్వారా, బండిపోరా, బారాముల్లా, బడ్గాం వంటి జిల్లాలలోని వేలాది మంది రైతులు, కూలీల జీవనోపాధి దెబ్బతింటుంది. హిందూ యాత్రికులే లక్ష్యంగా తీవ్ర వాదులు ఒడిగట్టిన ఒక్క దుశ్చర్యం మొత్తం కశ్మీర్ ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేయనుంది అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
Recommended image2
Now Playing
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
Recommended image3
Now Playing
నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved