టికెట్ కోసం ఎన్టీఆర్ ని దూరం పెట్టిందా..?
రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఎలెక్షన్స్ లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అధికార ప్రకటన కూడా వచ్చేసింది. హైదరాబాద్ లో కూకట్ పల్లి నియోజక వర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా సుహాసిని సీటు దక్కించుకుంది.
రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఎలెక్షన్స్ లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అధికార ప్రకటన కూడా వచ్చేసింది. హైదరాబాద్ లో కూకట్ పల్లి నియోజక వర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా సుహాసిని సీటు దక్కించుకుంది.
నందమూరి హరికృష్ణకి న్యాయం చేయడానికే చంద్రబాబు ఇలా చేశారని, కుటుంబ సభ్యులను సంప్రదించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపించాయి. కానీ నిజానికి సుహాసినిని అభ్యర్థిగా ప్రకటించేవరకు ఆమె సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు విషయం తెలియదని సమాచారం.
కేవలం సుహాసిని అలానే ఆమెకి దగ్గరైన కొందరిని మాత్రమే సంప్రదించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ఈ విధంగా చేయడంతో ఏం అనలేక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇంత రాజకీయం చేస్తారా అంటూ హరికృష్ణ కుటుంబసభ్యులు బాధపడుతున్నారట.
సుహాసిని కూడా ఎన్టీఆర్ తో ఒక్క మాట కూడా చెప్పలేదని అంటున్నారు. ఈ నేపధ్యంలో సోదరి కోసం కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు ప్రచారానికి వస్తారా అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. తండ్రి మరణంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దగ్గరైనట్లు కనిపించినా.. ఈ సంఘటనతో దూరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి!
ఇవి కూడా చదవండి..
కూకట్పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి
మీడియా ముందుకు నందమూరి సుహాసిని
33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని
‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?
హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్
సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి
చంద్రబాబుతో భేటీ: కూకట్పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే
తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్పల్లిపై ఉత్కంఠ
హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్
కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?