వంట ఎలా చేయాలి.. పంట ఎలా కోయాలి అన్న దగ్గరి నుంచి బాంబులు ఎలా తయారు చేయాలన్నది కూడా తెలుసుకోవడానికి యూట్యూబ్లో తెగ వెతికేస్తున్నారు. అంతలా యూట్యూబ్ ఒక కళాశాలగా... ఒక ట్రైనింగ్ సెంటర్లా మారిపోయింది. దీనిని అంత గుడ్డిగా ఫాలో అవుతున్నారు జనాలు. తాజాగా ప్రసవం ఎలా చేయాలో చూసి దానిని భార్యపైనే ప్రయోగించాడు ఓ భర్త. చివరికి ఆ ప్రయోగం వికటించి ఆమె మరణించింది.
తలలేని రాజధానితో ప్రజలు ఏం చేసుకోవాలని ప్రశ్నించారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని జేసీ కలిశారు
తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఢిల్లీలో సోమవారం ప్రధాని నరేంద్రమోడీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకే తాము నరేంద్రమోడీని కలిసినట్లు కలెక్షన్ కింగ్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలు గత 7 నెలలుగా ఏ పండుగ జరుపుకోవడం లేదన్నారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. సోమవారం వెంకటపాలెంలో చనిపోయిన రైతు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తోన్న వైఎస్ జగన్ సర్కార్ ఇందుకు సంబంధించి పనులను వేగవంతం చేసింది.
పోలీస్ స్టేషన్లలో అందించే సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను హైదరాబాద్ పోలీసులు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.
ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా సోమవారం ప్రకటించారు. ఫిబ్రవరి 22తో కేజ్రీవాల్ సర్కార్ కాలపరిమితి ముగియనుంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్ష పదవికి నాదెండ్ల బ్రహ్మం చౌదరి రాజీనామా చేశారు. వ్యక్తిగత సమస్యలతోనే రాజీనామా చేశానని.. ఇది తన సొంత నిర్ణయమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదని బ్రహ్మం చౌదరి తెలిపారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు రెండు రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.