ఇప్పటికే భారత ప్రభుత్వం వద్ద గత ఐదేళ్లుగా అమలు కొరకు ‘పెండింగ్’లో ఉన్న 2014 నాటి అధికారిక (శివరామకృష్ణన్ కమిటీ) నివేదికకు 2020 లో పేరు మార్చి, అదే పుస్తకానికి కొత్త ‘కవర్’ వేసి జగన్ అమలులోకి తెచ్చారు. (ప్రాంతీయ పార్టీలకు ఉండే ఇటువంటి స్వంత ముద్ర యావను ఇటువంటప్పుడు మనమూ తప్పు పట్టలేము) అందులో భాగంగా ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ కు నిలయమైన సచివాలయం విశాఖపట్టణంలో పెట్టాలని కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది.