అదృష్టవంతుడు ఎవరబ్బా అంటే టక్కున చెప్తారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అని. తక్కువ స్థానాలు గెలుచుకున్న అదృష్టం వరించడంతో ముఖ్యమంత్రి అయిపోయారు. లక్కీగా సీఎం అయిపోయిన కుమారస్వామి దైవదర్శనాలకు శ్రీకారం చుట్టారు. 82 రోజుల్లో 40 ఆలయాలను సందర్శించి రికార్డు సృష్టించారు
యూపీఏ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఏమీ ఉద్దరించలేదని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన అంతా కిరాయిగాళ్లతో షో చేయించినట్లు ఉందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తుంటే అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏ విడుదల చేసిన అమరావతి 2018 బాండ్లు స్టాక్ మార్కెట్లో రికార్డులు సృష్టించాయి. గంట వ్యవధిలో ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయి నూతన అధ్యయనానికి నాంది పలికాయి. ముంబాయి స్టాక్ ఎక్స్చేంజిలో ట్రేడింగ్ అవుతూనే గంట వ్యవధిలో 2 వేల కోట్ల రూపాయలను ఆర్జించాయి.
గంజాయి సాగు చేస్తున్న అమెజాన్ ఉద్యోగి ప్రణవ్ ను హైదరాబాద్ లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 75 ఎల్ ఎస్ డీ బాక్సుల గంజాయి, ఎండీఎన్ఐ డ్రగ్స్ ను ఎక్సైజ్ పోలీసులు నిందితుడు ప్రణవ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లో శరణార్థులుగా వలస వచ్చిన మయన్మార్ దేశానికి చెందిన నలుగురుని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతపురం జిల్లాలో సీనియర్ల వేధింపులకు ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. మదనపల్లిలో ఓ ప్రవేట్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న ప్రియాంకను సీనియర్లు వేధింపులకు గురిచేశారు.
బ్యాంకాక్ లో స్విమ్మింగ్ పూల్ లో పడి మచిలీపట్నంకు చెందిన పల్లంపాటి వెంకటేష్ దుర్మరణం చెందారు.
యూపీఏ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు
భార్య భర్తల మధ్య వివాదం...తమ కాపురం చక్కబెట్టండి అంటూ ఇరువురు పోలీసులను ఆశ్రయించారు. భార్య భర్తల మధ్య వివాదాన్ని గమనించిన సీఐ ఇద్దరినీ క్యాష్ చేసుకున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తును ప్రకటించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు బహిరంగ సభలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల గుర్తు ప్రకటించారు. తమ పార్టీ గుర్తు పిడికిలి అని స్పష్టం చేశారు.