సీఈఓ ద్వివేదికే దిక్కులేదు, సామాన్యుల పరిస్థితి ఏమిటీ:చంద్రబాబు

By narsimha lodeFirst Published Apr 12, 2019, 1:26 PM IST
Highlights

ఏపీ ఎన్నికల  ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేసిన పోలింగ్ కేంద్రంలోనే ఈవీఎంలు పనిచేయకపోతే  సామాన్యుల పరిస్థితి ఏమిటని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.ఎన్నికల కమిషన్‌ వైసీపీకి సహకరించినందున... ఎన్నికల నిర్వహణ బాగుందని ఆ పార్టీ కితాబిచ్చిందని బాబు మండిపడ్డారు.

అమరావతి:  ఏపీ ఎన్నికల  ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేసిన పోలింగ్ కేంద్రంలోనే ఈవీఎంలు పనిచేయకపోతే  సామాన్యుల పరిస్థితి ఏమిటని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.ఎన్నికల కమిషన్‌ వైసీపీకి సహకరించినందున... ఎన్నికల నిర్వహణ బాగుందని ఆ పార్టీ కితాబిచ్చిందని బాబు మండిపడ్డారు.

శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సాంకేతిక లోపాల పేరుతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ఇబ్బంది పెట్టారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.నేరస్తులు చెప్పినట్టుగా ఈసీ పనిచేసిందన్నారు. 

పోలింగ్ ప్రారంభమైన తర్వాత కనీసం 35 శాతం ఈవీఎంలు పనిచేయలేదన్నారు. ఏపీలో పోలింగ్‌ నిర్వహణలో ఈసీ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు.  ఈవీఎంలను  మార్చినా కూడ ఇదే రకమైన పరిస్థితులు పని చేయలేదన్నారు.

ఎన్నికల కమిషన్ బీజేపీకి బ్రాంచీ కార్యాలయంగా మారిందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలింగ్‌కు ముందు రోజునే వైసీపీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని  తాము ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటర్లు అర్ధరాత్రి దాటినా కూడ ఓపికగా వేచి చూసి ఓటింగ్‌లో పాల్గొన్నారని  చెప్పారు.  గతంలో ఎన్నడూ కూడ ఇలా జరగలేదన్నారు.బీజేపీ, వైసీపీ నేతలు చెప్పినట్టుగానే  ఈసీ పని చేసిందన్నారు.ఈవీఎంలు పనిచేయకపోతే వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడలేదో  చెప్పాలన్నారు.

సంబంధిత వార్తలు

ముందస్తు కుట్ర చేశారు, అయినా...: చంద్రబాబు

వైసీపీ అభ్యర్థి ప్రకాష్‌రెడ్డికి పరిటాల సునీత వార్నింగ్

ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

క్యూను దాటేసి ఓటేసిన పవన్ కళ్యాణ్: ఓటర్ల అసహనం

మూడు ఓట్ల కోసం చంద్రగిరి సెగ్మెంట్‌లో హైడ్రామా

150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి

పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి


 

click me!