Asianet News TeluguAsianet News Telugu

మోడీజీ.. ‘దీదీ పని ఖతం’.. అన్నారుగా ఇప్పుడేమంటారు... రామ్ గోపాల్ వర్మ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. 209 స్థానాలతో అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకుంది. బెంగాల్ లో మమత ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ చేసిన ప్రయత్నాల్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఈ విజయం మీద దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయనాయకులు దీదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ram gopal varma tweet on mamata victory and question to modi - bsb
Author
Hyderabad, First Published May 2, 2021, 4:07 PM IST

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. 209 స్థానాలతో అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకుంది. బెంగాల్ లో మమత ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ చేసిన ప్రయత్నాల్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఈ విజయం మీద దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయనాయకులు దీదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. మోడీగారూ.. నిన్న కూడా మమతా బెనర్జీ పని ఖతమయ్యింది.. అన్నారుగా ఇప్పుడు ఈ విజయం మీద ఏం చెబుతారు సార్.. అంటూ ట్వీట్ చేశాడు. 

బెంగాల్ లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీకి అక్కడి బీజేపీ అభ్యర్థి సువేందు గట్టి పోటీని ఇస్తున్నారు. 16వ రౌండ్ లో మమత 6 ఓట్ల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం చివరి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. 

ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగాయి. 27 మర్చి నుంచి 29 ఏప్రిల్ వరకు 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. జంగిపూర్, షంషేర్ గంజ్ అభ్యర్థుల ఆకస్మిక మరణం కారణంగా ఎన్నికల సంఘం ఈ రెండు స్థానాల ఎన్నికలను వాయిదా వేసింది. అక్కడ ఉపఎన్నిక మే 16వ తేదీన జరగనున్నాయి. 

మొత్తం 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 148 మేజిక్ ఫిగర్. ఎలాగైనా ఈసారి బెంగాల్ లో కాషాయ జెండా రెపరెపలాడించాలని బలంగా భావించిన బీజేపీ, మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకొని హాట్ ట్రిక్ కొట్టాలని మాత బెనర్జీ, అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి బరిలో నిలిచాయి. శాయశక్తులా ఎన్నికలో విజయం సాధించేందుకు తుదికంటా పోరాడాయి. 

ఇక ఈ ఎన్నికల్లో హిందుత్వ అస్త్రాన్ని, పరివర్తన నినాదాన్ని భుజానికెత్తుకొని బీజేపీ ప్రచారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పూర్తిగా బెంగాల్ ఎన్నికల మీద దృష్టిసారించి నెల రోజుల్లో దాదాపుగా తమ పర్యటనలను ప్లాన్ చేసుకొని ప్రచారం నిర్వహించారు. 

మరోపక్క మమతా బెనర్జీ బెంగాలీ అస్థిత్వాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. బెంగాలీలు కాని అమిత్ షా, మోడీ లు వచ్చి బెంగాల్ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, బెంగాలీలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయకూడదని బలంగా ప్రచారం నిర్వహించారు. 

ఇక ఈ ఎన్నికల పర్వం మొత్తం మాత బెనర్జీ వీల్ చైర్ లో కూర్చొనే ప్రచారం చేసారు. హై వోల్టేజి ఎన్నికల యుద్ధం ఇక్కడ వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళింది. బములు విసురుకోవడం, తుపాకీ కాల్పులు అన్ని వెరసి ఎన్నికల వాతావరణం ఒకింత హింసాత్మకంగా మారింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత బెనర్జీ కోసం ఈ ఎన్నికల్లో పనిచేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios