- Home
- Entertainment
- Chiranjeevi: చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లు ఫీల్ అయ్యా.. ఆ మూవీని చెడగొట్టింది ఎవరో తెలుసా
Chiranjeevi: చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లు ఫీల్ అయ్యా.. ఆ మూవీని చెడగొట్టింది ఎవరో తెలుసా
చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఓ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. అయితే ఆ సినిమాని చెడగొట్టింది తాను కాదు అంటూ దర్శకుడు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులకు ఒక పండగ. అభిమానులు పూర్తి సంతృప్తినిచ్చే విధంగా సినిమా ఉండడం కోసం నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి. అలా బడ్జెట్ పెరిగిపోయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొన్ని చిరంజీవి సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మృగరాజు ఒకటి.
చిరంజీవి, దేవి వరప్రసాద్ సినిమాలు
చిరంజీవితో కొండవీటి రాజా, మంచి దొంగ, ఘరానా మొగుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన దేవి వరప్రసాద్ మృగరాజు చిత్రానికి కూడా నిర్మాత. దేవి వరప్రసాద్, చిరంజీవి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. చిరంజీవి సినిమా అంటే దేవి వరప్రసాద్ ఖర్చుకు అస్సలు వెనుకాడరు. మృగరాజుకి ముందు చిరంజీవి, గుణశేఖర్ కాంబోలో వచ్చిన చూడాలని ఉంది చిత్రం ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది.
రిలీజ్ రోజే చనిపోయిన ఫీలింగ్
వీరి ముగ్గురి కాంబోలో మరో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంచనాలకు తగ్గట్లుగానే చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో మృగరాజు సినిమాని నిర్మించారు. కానీ ఆ సినిమా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వలేదు. డిజాస్టర్ అయింది. ఈ సినిమా విషయంలో అసలు తప్పు ఎక్కడ జరిగిందో గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. మృగరాజు మూవీ రిలీజ్ అయిన రోజే తాను చనిపోయినట్లు అనిపించింది అని దేవి వరప్రసాద్ ఓ సందర్భంలో అన్నారు. అంటే అప్పటికే సినిమా రిజల్ట్ అర్థం అయిపొయింది.
అది అసలు నా కథ కాదు
గుణశేఖర్ మాట్లాడుతూ దేవి వరప్రసాద్ గారు నన్ను ఎక్కడైనా తప్పు పట్టారా ? అది మీరు విన్నారా ? అని ప్రశ్నించలేదు. అంత పెద్ద సినిమా ఫెయిల్ అయినప్పుడు ఏ నిర్మాతకి అయినా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ మూవీ విషయంలో నా తప్పు అయితే లేదు. ఆ సినిమాని చెడగొట్టింది నేను కాదు. మృగరాజు అసలు నా కథ కాదు. ఆల్రెడీ రెడీ అయిన కథలోకి నేను వచ్చాను. పైగా ఎప్పుడూ సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన సినిమాని ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉండగానే సంక్రాంతికి రిలీజ్ చేశారు. అంత హడావిడిగా రిలీజ్ చేస్తే క్వాలిటీ అవుట్ పుట్ ఎలా వస్తుంది ?
నా ప్రమేయం లేకుండానే తప్పులు
రిలీజ్ టైం దగ్గర పడుతున్న సమయంలో నేను వేరే వర్క్ లో బిజీగా ఉన్నాను. అన్ని పనులు నేనే చూడడం కుదరదు. దీనితో దేవి వరప్రసాద్ గారే తన ఆధ్వర్యంలో భారీ సెట్ వేసి చివరి సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగ్ కోసం అయన విచ్చలవిడిగా డబ్బు కుమ్మరించారు. సాంగ్ బావుండాలి అని హైడ్రాలిక్ మెషీన్స్ కూడా తెప్పించారు. ఇలాంటి తప్పులన్నీ నా ప్రమేయంతో జరగలేదు అని గుణశేఖర్ తెలిపారు. అయినప్పటికీ చిరంజీవి గారు, దేవి వరప్రసాద్ గారు ఇద్దరితో నాకు మంచి రిలేషన్ ఉంది అని గుణశేఖర్ తెలిపారు.

