- Home
- Entertainment
- Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర థియేటర్లో ఇంకా కొనసాగుతుంది. ఆయన హీరోగా నటించిన `ఇరుముడి` మూవీ విడుదలై నెల రోజులకు దగ్గరగా వస్తున్నా, ఇంకా ఈ మూవీ థియేటర్లో దుమ్ములేపుతోంది.

ట్రోలర్స్ సమాధానం చెబుతూ రవితేజ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్
రవితేజకి హిట్ పడి చాలా రోజులవుతుంది. ఈ క్రమంలో ఆయన హీరోగా కెరీర్పైనే విమర్శలు వచ్చాయి. మల్టీస్టారర్ చిత్రాలు చేయాలని, ఇక క్యారెక్టర్స్ చేయాల్సిందే అనే విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. కానీ తానేంటో మరోసారి నిరూపించారు రవితేజ. ఆయన `ఇరుముడి` చిత్రంలో హీరోగా నటించారు. అయితే ఇది రెగ్యూలర్ రవితేజ మార్క్ సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రం. తన మార్క్ డాన్సులు లేవు, పైట్లు లేవు, కామెడీ లేదు. పూర్తిగా డివైన్ అంశాలు, తండ్రీకూతుళ్ల బాండింగ్ని, అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలను, అమ్మాయిలను పెంచే విధానాన్ని బేస్ చేసుకొని దర్శకుడు శివ నిర్వాణ `ఇరుముడి` మూవీని రూపొందించారు. ఈ మూవీతో రవితేజ ట్రోల్స్ కి, విమర్శలకు బాక్సాఫీసు కలెక్షన్లతో సమాధానం చెప్పారు.
నాల్గో వారంలోనూ ఇరుముడికి సంచలన వసూళ్లు
ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటించింది. సాయికుమార్, అజయ్ ఘోష్, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిరా, కొమురం, లక్ష్మణ్, స్వసిక విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. గత నెల 21న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. అదిరిపోయే వసూళ్లని రాబడుతోంది. ఓపెనింగ్స్ రెగ్యూలర్గానే ఉన్నా, ఆ తర్వాత మాత్రం పుంజుకుంది. మొదటి రెండు వారాల్లో ఊహించని వసూళ్లని రాబట్టింది. ఇక ఇప్పుడు నాల్గో వారంలోనూ ఈ సినిమా జోరు తగ్గడం లేదు. మొన్న వారం వచ్చిన సినిమాలు కనీం కోటి రూపాయలుచేయలేని పరిస్థితుల్లో ఉండగా, ఇప్పటికీ `ఇరుముడి` రోజుకి కోటికిపైగా వసూళ్లని రాబట్టడం విశేషం.
ఇరుముడి మూవీ 27 రోజుల కలెక్షన్లు
`ఇరుముడి` మూవీ 27వ రోజు రూ.1.10కోట్లు రాబట్టింది. 96లక్షల నెట్ని రాబట్టగా, సుమారు అరవై లక్షల షేర్ని సాధించడం విశేషం. ఈ చిత్రానికి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.237.55కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో ఇది రూ.22.45కోట్లు, ఇండియాలో రూ.215కోట్లు రాబట్టింది. ఇది రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. అదే సమయంలో టాలీవుడ్లోనే అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలవడం విశేషం. ఈ మూవీకి సుమారు రూ.120కోట్ల షేర్ వచ్చింది. అంటే వంద కోట్ల వరకు లాభాలు వచ్చాయి. అటు నిర్మాతలు, ఇటు బయ్యర్ల పంట పండింది. ఏడాదికి సరిపడ లాభాలు ఈ ఒక్క మూవీతో రావడం విశేషం.
ఫ్యామిలీ ఆడియెన్స్ కి గుడ్న్యూస్.. ఓటీటీలోకి ఇరుముడి
ఈ మూవీకి సుమారు రూ.40కోట్ల బడ్జెట్ అయ్యింది. 20కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓటీటీ రైట్స్ రూపంలో గట్టిగానే వచ్చింది. ఇక ఈసినిమా ద్వారా రవితేజకి ఏకంగా రూ.50-60కోట్ల వరకు పారితోషికం అందిందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీ థియేట్రికల్గా క్లోజ్ కాబోతుంది. ఈ రోజు(సెప్టెంబర్ 18) అర్థరాత్రి నుంచి ఓటీటీలోకి రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కిది గుడ్ న్యూస్గా చెప్పొచ్చు.

