MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • Tirumala: నాలుగున్న‌ర గంటల్లోనే తిరుప‌తికి వెళ్లొచ్చు.. కొత్త వందే భార‌త్ వ‌చ్చేస్తోంది.

Tirumala: నాలుగున్న‌ర గంటల్లోనే తిరుప‌తికి వెళ్లొచ్చు.. కొత్త వందే భార‌త్ వ‌చ్చేస్తోంది.

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌. ఇక‌పై ఆ ప్రాంత ప్ర‌జ‌లు కేవ‌లం నాలుగున్న‌ర గంట‌ల్లోనే తిరుప‌తికి చేరుకోవ‌చ్చు. ఇందులో భాగంగానే కొత్త వందే భార‌త్ రైలును ప్రారంభించేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఏ రూట్‌లో అందుబాటులోకి రానుందంటే. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 13 2025, 08:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయవాడ బెంగళూరు మధ్య కొత్త వందే భారత్ ట్రైన్
Image Credit : TTD website, Indina Railway/X

విజయవాడ-బెంగళూరు మధ్య కొత్త వందే భారత్ ట్రైన్

తెలుగు రాష్ట్రాలకు మరో వేగవంతమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకూ నడుస్తున్న వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో, రైల్వే శాఖ మరో నూతన ట్రైన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈసారి విజయవాడ నుంచి బెంగళూరుకు తిరుపతి మీదుగా ప్రయాణించేలా రూట్‌ను ఖరారు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆమోదం ల‌భించినా..
Image Credit : stockphoto

ఆమోదం ల‌భించినా..

నిజానికి ఈ కొత్త వందే భారత్‌కు కొన్ని నెలల క్రితమే ఆమోదం లభించినప్పటికీ, కోచ్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రారంభంలో కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడంతో, ట్రైన్‌ను పట్టాలెక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

36
త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం
Image Credit : X@Sid_IRTS

త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం

ఈ వందే భారత్ రైలు ద్వారా విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం 9 గంటలలోపు చేరుకోవచ్చు. అలాగే తిరుపతికి నాలుగు గంటల 30 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ఇది ఇతర సాధారణ రైళ్లతో పోలిస్తే 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రత్యేకించి, తిరుపతికి వెళ్తున్న భక్తులకు ఇది మరింత ప్రయోజనం కలిగించేలా ఉంటుంది. విజ‌య‌వాడ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి తిరుప‌తి వెళ్లే వారికి ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అధికారులు భావిస్తున్నారు.

46
వారానికి ఆరు రోజులు సేవలు
Image Credit : Indan Railways/X

వారానికి ఆరు రోజులు సేవలు

ఈ ట్రైన్‌లో మొత్తం 8 బోగీలు ఉంటాయి. అందులో 7 AC చెయిర్ కార్లు, 1 ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ ఉంటుంది. మంగళవారం మినహా వారానికి 6 రోజులు ఈ వందే భారత్ రైలు నడవనుంది. విజయవాడ నుంచి బెంగళూరు వరకు నడిచే వందే భారత్‌ ట్రైన్‌కు 20711 నంబర్ కేటాయించగా, తిరుగు ప్రయాణానికి 20712 నంబర్ నిర్ణయించారు.

56
స‌మ‌యాలు
Image Credit : GEMINI AI

స‌మ‌యాలు

విజ‌య‌వాడ నుంచి ఉద‌యం 5:15 గంట‌ల‌కు ఈ రైలు బ‌య‌లుదేరుతుంది. తెనాలికి 5:39, ఒంగోలు: 6:28, నెల్లూరు 7:43గా తిరుప‌తికి ఉద‌యం 9:45 గంట‌ల వ‌ర‌కు చేరుకుంటుంది. ఇక చిత్తూరుకు 10:27, కాట్పాడి: 11:13, కృష్ణరాజపురంకు మ‌ధ్యాహ్నం 1:38 గంట‌ల‌కు చేరుకుంటుంది. బెంగ‌ళూరుకు వేళ్లే స‌రికి మ‌ధ్యాహ్నం 2.15 గంట‌లు అవుతుంది.

66
తిరుగు ప్ర‌యాణ స‌మ‌యం
Image Credit : Indian Railways

తిరుగు ప్ర‌యాణ స‌మ‌యం

ఇక తిరుగు ప్ర‌యాణం విష‌యానికొస్తే ఈ రైలు బెంగ‌ళూరులో మ‌ధ్యాహ్నం 2:45 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. కృష్ణరాజపురంకు 2:58, కాట్పాడికి 5:23, చిత్తూరు 5:49, తిరుపతి 6:55, నెల్లూరు 8:18, ఒంగోలు 9:29, తెనాలి 10:42 మీదుగా రాత్రి 11.45 గంట‌ల‌కు విజ‌య‌వాడ చేరుకుంటుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
విజయవాడ
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Recommended image2
Now Playing
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu
Recommended image3
Now Playing
జగన్ మత మార్పిడులపై Vijaysai Reddy Sensational Comments | Asianet Telugu
Related Stories
Recommended image1
Rain Alert: క‌రుణించ‌వా వ‌రుణ దేవా.! అనుకున్న స్థాయిలో వ‌ర్షాలు ఎందుకు ప‌డ‌డం లేదో తెలుసా?
Recommended image2
Amazon sale: రూ. 6 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫ‌ర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved