Telangana: టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నదనీ, దేశంలో తయారైన 3 కోవిడ్-19 వ్యాక్సిన్లలో 2 హైదరాబాద్ నగరంలోనే పుట్టాయనీ, ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ. రామారావు (కేటీఆర్) అన్నారు.
Telangana Feb 24, 2022, 5:20 PM IST
మూడు వేర్వేరు గ్రూపులపై ఈ అధ్యయనంలో ఒకే వ్యక్తికి మొదట కోవాక్సిన్ తరువాత కోవిషీల్డ్ ఒక డోస్ ఇవ్వబడుతుంది. సూది అవసరం లేని నాసల్ టెక్నిక్ ద్వారా కోవాక్సిన్ ఇవ్వబడుతుంది. ఇటీవల, భారత్ బయోటెక్ కంపెనీ ICMR సహకారంతో ఈ నాసల్ వ్యాక్సిన్ను సిద్ధం చేసింది.
Health Feb 8, 2022, 4:55 AM IST
భారత్ దేశంలో బూస్టర్ డోసుగా త్వరలో స్పుత్నిక్ లైట్ రానున్నది. ఇప్పటికే ఈ టీకాను అత్యవసర వినియోగ సమయంలో పంపిణీ చేయడానికి అనుమతులు ఉన్నాయి. తాజాగా, స్పుత్నిక్ వీ టీకా కోసం స్పుత్నిక్ లైట్ను బూస్టర్ డోసుగా అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ దరఖాస్తు పెట్టుకుంది. దీనిపై ఇంకా భారత ప్రభుత్వ రెగ్యులేటరీ స్పందించాల్సి ఉన్నది.
NATIONAL Feb 6, 2022, 4:08 PM IST
Coronavirus: హైదరాబాద్ చెందిన కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్నఇంట్రానాసల్ కోవిడ్ బూస్టర్ డోస్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) అనుమతి ఇచ్చింది. బూస్టర్ డోసు థర్డ్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ నిపుణుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
NATIONAL Jan 28, 2022, 4:08 PM IST
Vaccination for Children: దేశంలో కరోనా విజృంభనతో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది (Corona vaccination in India). దీనితో ఇప్పటివరకు అర్హులైన వయోజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే.. 74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది. ఈ తరుణంలో.. చిన్న పిల్లల టీకా పంపిణీకి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. జనవరి 2023 నాటికి 15 ఏళ్లు నిండిన వారు 15-18 ఏళ్లలోపు వ్యాక్సిన్కు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అదనపు కార్యదర్శి మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలకు విడుదల చేసింది.
NATIONAL Jan 28, 2022, 11:07 AM IST
భారత్లో వ్యాక్సినేషన్లో కోవాగ్జిన్ (Covaxin), కోవిషీల్డ్ (Covishield) టీకాలది కీలక పాత్ర. అయితే తాజాగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్లో విక్రయానికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం షరతులతో కూడిన ఆమోదం తెలిపింది.
NATIONAL Jan 27, 2022, 5:12 PM IST
కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ టీకాలకు అత్యవసర సమయంలో వినియోగానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. తాజా అనుమతులను కొన్ని షరతులతో కలిపి ఇచ్చింది. ఈ నిర్ణయంతో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు క్లినిక్లు, హాస్పిటళ్లలో వయోజనులకు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. దీంతో కావాల్సిన వారూ తమకు ఇష్టం ఉన్న హాస్పిటల్ వెళ్లి ఈ రెండింటిలో కోరిన టీకాను బూస్టర్ డోసుగా వేసుకునే వెసులుబాటు కలుగనుంది.
NATIONAL Jan 27, 2022, 4:57 PM IST
పాఠశాల గేటు వద్ద తిరుగుతున్న విద్యార్థిని వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్నాడనుకున్న పాఠశాల సిబ్బంది ధైర్యం చెప్పి, లోపలికి తీసుకెళ్లారు. vaccination వేయడం పూర్తయ్యాక తాను మొదటి టీకా కూడా వేయించుకున్నట్లు మెల్లగా చెప్పాడు. దీంతో పాఠశాల సిబ్బంది ఖంగుతిన్నారు.
NATIONAL Jan 20, 2022, 12:15 PM IST
ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సీడీఎస్ సీఓకు చెందిన నిపుణుల కమిటీ బుధవారం సమావేశమై కొన్ని షరతులకు లోబడి రెండు టీకాలకు బహిరంగ విపణి అనుమతులను జారీ చేయవచ్చని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తుది ఆమోదం కోసం ఈ సిఫార్పులను డీసీజీఐకి పంపించనున్నారు.
NATIONAL Jan 20, 2022, 7:50 AM IST
వ్యాక్సినేషన్ (vaccination)లో టీనేజర్లు (teenagers) ఉత్సాహం చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 3వ తేదీ నుంచి టీనేజర్లకు కోవిడ్ - 19 వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే ఈ 11 రోజుల్లో 42 శాతం మంది టీకాలు వేసుకున్నారు. ఈ నెలాఖరు నాటికి దేశంలో 7.40 కోట్ల మంది టీనేజర్లలో 80-85 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిన్ (CoWIN) పోర్టల్ ప్రకారం దేశంలోని టీనేజర్లలో 3,14,87,269 మందికి వ్యాక్సిన్ అందించారు.
NATIONAL Jan 14, 2022, 11:48 AM IST
కొవాగ్జిన్ బూస్టర్ డోసు.. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొంటున్నదని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎమోరీ యూనివర్సిటీలో చేపట్టిన ఓ పరీక్షలో ఈ విషయం వెల్లడైందని వివరించింది. రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకున్న ఓ వ్యక్తి శాంపిళ్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టం అయిందని తెలిపింది.
NATIONAL Jan 12, 2022, 11:55 PM IST
టీకా వేసిన తర్వాత పారాసెటమల్ లేదా పెయిన్ కిల్లర్లను సజెస్ట్ చేయడంపై కొవాగ్జిన్ టీకా తయారిదారు భారత్ బయోటెక్ బుధవారం స్పందించింది. 15 నుంచి 17 ఏళ్ల చిన్నారులకు కొవాగ్జిన్ టీకా వేసిన తర్వాత పారాసెటమల్, ఇతర పెయిన్ కిల్లర్లను సూచించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్లో 10 నుంచి 20 శాతం మంది వాలంటీర్లలో సైడ్ ఎఫెక్ట్లు కనిపించాయని, ఆ తర్వాత అవి ఒకట్రెండు రోజుల్లో నయం అయ్యాయని వివరించింది.
NATIONAL Jan 6, 2022, 12:59 PM IST
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. కరోనాను ఎదుర్కొవడంలో వ్యాక్సినేషన్ కీలకపాత్ర పోషిస్తుందని భావించిన ప్రభుత్వం 2020 జనవరి నుంచి ప్రజలకు వ్యాక్సిన్ లు వేస్తోంది. కరోనా రెండో వేవ్ ముగిసిన తరువాత ఇటీవలే స్కూల్స్, కాలేజీలు ఓపెన్ చేశారు. దీంతో ఇప్పుడిప్పుడే పిల్లలు చదువుకునేందుకు కాలజీలకు, స్కూల్స్కు వెళ్తున్నారు. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన ఎక్కువైంది. కోవిడ్ -19 డెల్టా వేరియంట్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. వీటి నుంచి పిల్లలను రక్షించాలంటే వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
NATIONAL Jan 4, 2022, 5:42 PM IST
coronavirus: దేశంలో కరోనా కొత్త వేరియంట్ విజృంభణ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా దేశంలో నేటి నుంచి పిల్లలకు (15 నుంచి 18 ఏళ్లలోపు) కరోనా వ్యాక్సిన్ను ఇవ్వనున్నారు. దీని కోసం జనవరి 1వ తేదీ శనివారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు.
NATIONAL Jan 3, 2022, 6:48 AM IST
తాలిబాన్లతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్తాన్కు భారత ప్రభుత్వం మరోసారి సహాయ హస్తం అందించింది. ఐదు లక్షల కొవాగ్జిన్ టీకాలను ఈ దేశానికి పంపించింది. వచ్చే వారాల్లో మరో ఐదు లక్షల టీకాలను అందించడానికి కట్టుబడి ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. టీకాలతోపాటు ఆహార ధాన్యాలను పంపిస్తామని తెలిపింది. గత నెలలోనూ భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మెడికల అసిస్టెన్స్ను ఆ దేశానికి అందించింది.
NATIONAL Jan 1, 2022, 6:22 PM IST