మూడు వేర్వేరు గ్రూపులపై ఈ అధ్యయనంలో ఒకే వ్యక్తికి మొదట కోవాక్సిన్ తరువాత కోవిషీల్డ్ ఒక డోస్ ఇవ్వబడుతుంది. సూది అవసరం లేని నాసల్ టెక్నిక్ ద్వారా కోవాక్సిన్ ఇవ్వబడుతుంది. ఇటీవల, భారత్ బయోటెక్ కంపెనీ ICMR సహకారంతో ఈ  నాసల్  వ్యాక్సిన్‌ను సిద్ధం చేసింది. 

మొట్టమొదటిసారిగా దేశంలో త్వరలో మూడు వ్యాక్సిన్‌లను కలపడం ద్వారా క్లినికల్ అధ్యయనాలు ప్రారంభం కానున్నాయి. ఈ అధ్యయనం ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ అనుమతి కూడా పొందింది.డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి అందిన సమాచారం ప్రకారం, భారత్‌ బయోటెక్‌ కంపెనీ Covaxin, Covishield, nasal vaccineలను ఏకకాలంలో ట్రయల్స్ నిర్వహించాలని యోచిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మూడు వేర్వేరు గ్రూపులపై ఈ అధ్యయనంలో ఒకే వ్యక్తికి మొదట కోవాక్సిన్ తరువాత కోవిషీల్డ్ ఒక డోస్ ఇవ్వబడుతుంది. సూది అవసరం లేని నాసల్ టెక్నిక్ ద్వారా కోవాక్సిన్ ఇవ్వబడుతుంది. ఇటీవల, భారత్ బయోటెక్ కంపెనీ ICMR సహకారంతో ఈ నాసల్ వ్యాక్సిన్‌ను సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో డీసీజీఐకి చెందిన నిపుణుల వర్కింగ్ కమిటీ (SEC) ఈ అధ్యయనానికి అనుమతి ఇవ్వనున్నట్లు కూడా తెలిసింది.

కంపెనీ అప్లికేషన్‌లో 800 మందికి పైగా పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూడు వేర్వేరు గ్రూపులలో జరుగుతున్న ఈ అధ్యయనం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)తో సహా దేశంలోని తొమ్మిది ఆసుపత్రులలో చేయవచ్చు. మూడు గ్రూపులలో ఒక గ్రూపుకి నసల్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది.

గతంలో Covaxin రెండు డోసులను తీసుకున్న రెండవ గ్రూపులోని వారు అదనపు బూస్టర్ డోస్ అందుకుంటారు అలాగే Covashield రెండు డోసులు తీసుకున్న మూడవ గ్రూప్ లోని Covaxinని అందుకుంటారు. ఈ గ్రూపుల ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత, చివరి టెస్ట్ మరో గ్రూపుపై ఉంటుంది, ఆ తర్వాత మిక్సెడ్ డోస్ ప్రభావం గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది.

వాస్తవానికి, కరోనా వ్యాక్సిన్ మిక్సెడ్ డోస్ కు సంబంధించి ప్రపంచ స్థాయిలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. గత సంవత్సరం సిఎంసి వెల్లూరు వైద్యులు ఈ అధ్యయనాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం నుండి అనుమతి కోరారు. అయితే, ఈ అధ్యయనం ముగింపు ఇంకా తెరపైకి రాలేదు. ఇందులో, కోవిషీల్డ్, కోవాక్సిన్‌తో మాత్రమే పని జరుగుతోంది, అయితే మూడు వ్యాక్సిన్‌లపై అధ్యయనం మొదటిసారి ప్రారంభమవుతుంది.