- Home
- Entertainment
- Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
చిరంజీవి తన పుట్టిన ఊరు మొగల్తూరులో ఇంటిని లైబ్రరీకి ఇమ్మంటే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇంటిని అమ్మేసుకున్నారట. దీంతో దారుణంగా ట్రోల్ అయ్యారు. దీనిపై చిరంజీవి స్పందించి వివరణ ఇచ్చారు.

అవమానాలు దాటుకొని మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో స్ట్రగుల్స్ పడి సినిమాల్లో రాణించారు. వరుస విజయాలు అందుకొని స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్గా ఎదిగారు. తన జర్నీలో చిరంజీవి చాలా అవమానాలు ఫేస్ చేశారు. ప్రీమియర్స్ షో వేస్తే ఓ హీరో తనని దారుణంగా అవమానించాడట. అంతేకాదు లేట్గా షూటింగ్కి వచ్చాడని ఓ నిర్మాత రోజంతా ఎండలో నిల్చోబెట్టారట. ఇలాంటివి చాలానే ఉన్నాయి. కానీ వాటిని కసిగా తీసుకొని తానేంటో నిరూపించుకొని ఇప్పుడు తిరుగులేని మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి.
3లక్షలకే ఇంటిని అమ్మేసిన చిరంజీవి
ఇదిలా ఉంటే పెద్ద స్టార్ అయ్యాక చిరంజీవి చేసిన ఒక పని ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఒక నిందని ఇప్పటి వరకు మోస్తున్నారు. మరి అదేంటంటే.. మొగల్తూరులో చిరంజీవికి సంబంధించి ఒక ఇళ్లు ఉంది. అక్కడి వారు లైబ్రరీ కోసం ఇమ్మని అడిగారట. వాళ్లు ఫోర్స్ చేస్తుంటే, చిరంజీవి ఆ ఇంటిని అమ్మేశారట. మూడు లక్షలకే ఆ ఇంటిని అమ్మేశారట. మొదట ఇంటిని అమ్మమని మేనేజర్లకి చెబితే ఇంకా అమ్మలేదట. ఈ విషయంపై ఆయన సీరియస్ కూడా అయ్యారట. చివరికి ఎట్టకేలకు మూడు లక్షలకు అమ్ముకున్నారని, లైబ్రరీకి ఇవ్వలేదని, సినిమాల ద్వారా కోట్లు సంపాదించే చిరంజీవి.. 3 లక్షలకే కక్కుర్తి పడితే ఇక జనాలకు ఏం సర్వీస్ చేస్తారని ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శించారట.
చిరంజీవి వివరణ
తాజాగా ఈ ప్రశ్న చిరంజీవికి ఎదురైంది. దీనిపై ఆయన స్పందించారు. ఇన్నాళ్లు దీనిపై స్పందించని ఆయన ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. ఈ విషయం తన వరకు వచ్చిందని చెప్పారు. అయితే ఆ ప్రాపర్టీ తనది కాదని, అది తన మామయ్య(అమ్మ వాళ్ల తమ్ముడు)ది అని చెప్పారు. వాళ్ల ప్రాపర్టీపై తనకు ఎందుకు హక్కు ఉంటుంది, అది తనది ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలు, ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తారో అర్థం కాదు, బూరదజల్లే ప్రయత్నమే కాని, ఇది మరోటి కాదన్నారు చిరంజీవి. అది తన మామయ్యది కావడంతో ఆయన అమ్ముకున్నారని, దానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ ప్రచారం చేశారని తెలిపారు. అయితే దీని వల్లే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో చాలా బ్యాడ్ అయ్యిందట. పార్టీపై ప్రభావం చూపించిందట.
మొగల్తూరులో సొంతంగా లైబ్రరీ కట్టించిన చిరంజీవి
ఈ విషయంలోనే చిరంజీవి తన గొప్ప మనసుని చాటుకున్నారు. అదే మొగల్తూరులో తన ఫ్రెండ్ సత్యం(పండరి) సహకారంతో తాను సొంతంగా ఒక లైబ్రరీ నిర్మించారట. దానికి చిరంజీవి గ్రాంథాలయం అనే పేరు కూడా పెట్టారు. ఇప్పటికీ అది వాడుకలో ఉంది. తాను పుట్టిన ఊరుకోసం ఇంత చేసినా, ఆయన మాత్రం ఈ నిందని మోస్తూనే ఉన్నారు.
ఇక ప్రస్తుతం చిరంజీవి `కాకా` అనే చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. వచ్చే సంక్రాంతికి ఇద విడుదల కానుంది. మరోవైపు `విశ్వంభర` మూవీ విడుదల కావాల్సి ఉంది.

