పాకిస్థాన్ లో '2.0' పరిస్థితి ఏంటంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ రూపొందించిన ఈ సినిమాను దాదాపు 10 వేల స్క్రీన్ లలో విడుదల చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ రూపొందించిన ఈ సినిమాను దాదాపు 10 వేల స్క్రీన్ లలో విడుదల చేశారు. తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ వంద కోట్లు వసూలు చేసిందని టాక్.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల షేర్ వసూలు చేయగా, తమిళనాడులో ముప్పై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని సమాచారం. ఇండియాలో మాత్రమే కాకుండా పాకిస్థాన్ లో కూడా ఈ సినిమా విడుదలైంది. అక్కడ దీని డిమాండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.
మొదట పాకిస్థాన్ లో 15 నుండి 20 థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే అడ్వాన్స్ బుకింగ్ లోనే టికెట్స్ అన్నీ అమ్ముడయ్యాయి. సినిమాకు డిమాండ్ భారీగా ఉండడంతో పాకిస్థాన్ లో ఇప్పుడు స్క్రీన్ల సంఖ్యను 75కి పెంచారు.
దీన్ని బట్టి పాకిస్థాన్ లో రజినీకాంత్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుస్తోంది. గతంలో రజినీకాంత్ నటించిన 'కబాలి' సినిమా కూడా పాకిస్థాన్ లో విడుదలై మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు మరోసారి రజినీకాంత్ సినిమా థియేటర్ లోకి రావడంతో అక్కడి ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు!
ఇవి కూడా చదవండి..
'2.0' లో అక్షయ్ కుమార్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఇతడే!
బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!
శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!
శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!
'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!
శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!
'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!
'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?
'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!
2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?